PM Modi's Visit to Telangana: ఈ నెల 5న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, బందోబ‌స్తుపై స‌మీక్ష‌ నిర్వహించిన తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌, ప్రధాని మోదీ పాల్గొనే వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు ఆదేశాలు

ఫిబ్రవరి 5న నగరానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు (PM Modi's Visit to Telangana) సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ (Chief Secy omesh Kumar) గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ( review meeting with officials) నిర్వహించారు.

TS Chief Secy Somesh Kumar (Photo-Twitter)

Hyd, Feb 3: ఫిబ్రవరి 5న నగరానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు (PM Modi's Visit to Telangana) సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ (Chief Secy omesh Kumar) గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ( review meeting with officials) నిర్వహించారు. ప్రధానమంత్రి నగర శివార్లలోని ముచ్చింతల్‌లో 11వ శతాబ్దపు సన్యాసి శ్రీ రామానుజాచార్య యొక్క భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

అనంతరం సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) కోసం అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థను సందర్శించనున్నారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ అధికారుల‌ను ఆదేశించారు. ప్రధాని మోదీ పాల్గొనే వేదికల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్త్‌ను బ్లూ బుక్‌ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు శాఖను ఆదేశించారు.

వేదికల వద్ద తగు వైద్య శిబిరాలతోపాటు, నిపుణులైన వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. వీవీఐపీ సందర్శన సమయంలో కోవిడ్-19 ప్రోటోకాల్‌ పాటించేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని సీఎస్ ఆదేశించారు. వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలను చేపట్టాలని, కోవిడ్-19 స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో స‌న్న‌ద్ధం చేయాల‌ని సీఎస్ సూచించారు.

కేసీఆర్ కొత్త రాజ్యాంగం వ్యాఖ్యలు, రాజ్యాంగాన్ని కాదు.. నిన్నే మార్చాలంటూ సీఎంపై దళిత సంఘాల నేతలు మండిపాటు, యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

ప్రధానమంత్రి కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భ‌వ‌నాల‌ శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. వీఐపీ సందర్శించే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం, ముచ్చింత‌ల్, ఇక్రిసాట్ వద్ద ఏర్పాట్లను కార్యక్రమాల నిర్వాహకులతో సమన్వయం చేయాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

ఈ సమావేశంలో డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఇంధన, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శ ఎస్.ఏ.ఎం రిజ్వీ, రవాణా, రోడ్డు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now