Telangana weather Alert: తెలంగాణ‌లో దంచికొడుతున్న ఎండ‌లు, నేటి నుంచి పెరుగ‌నున్న‌ మూడు డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు, మార్చి రెండో వారం నుంచి ఎండాకాలం షురూ

రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వెల్లడించింది. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు (Temperatures) మరింత పెరుగుతాయని పేర్కొన్నది.

Temperature in Telangana (Credits: Twitter)

Hyderabad, FEB 28: తెలంగాణలో బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు (Temperatures) పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వెల్లడించింది. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు (Temperatures) మరింత పెరుగుతాయని పేర్కొన్నది. మరోవైపు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమూ ఉన్నదని తెలిపింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, రాత్రి 20 డిగ్రీలుగా నమోదైంది.

 

తెలంగాణలో గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. పశ్చిమ తెలంగాణలో వేడి ఎక్కువగా ఉంటుందని, హైదరాబాద్‌లోనూ ఎండలు అధికంగానే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే ఐదురోజులపాటు రాయలసీమలో వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Hyderabad: నార్సింగిలో సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను తొలగించిన అధికారులు, బీఆర్ఎస్ ఆనవాళ్లను చెరిపేసే కక్ష సాధింపు చర్య అని మండిపడిన బీఆర్ఎస్

Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం, థియేటర్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్