Nepal Plane Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం, ప్రమాద సమయంలో విమానంలో 72 మంది, 5గురు భారతీయులు సహా మొత్తం 15 మంది విదేశీయులు

నేపాల్‌(Nepal)లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటు చేసుకొంది. కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.

Nepal Plane Crash (Photo Credit: ANI)

Pokhara, JAN 15:  నేపాల్‌(Nepal)లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటు చేసుకొంది. కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్‌ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం, ఓల్డ్ ఎయిర్‌ పోర్టు మధ్య  చోటు చేసుకొంది. ఈ విషయాన్ని యతి ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది సుదర్శన్‌ బర్తౌలా ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చీఫ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ తెక్‌ బహదూర్‌ కేసీ స్థానిక పత్రికలకు తెలిపారు.

ఈ విమానంలోని వారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని ఆయన చెప్పారు. విమాన ప్రమాదం జరిగిన చోట భారీగా మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో విమానానికి చెందిన ఒక్క రెక్క తప్ప మొత్తం కాలిపోయింది. ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతున్నాయి.

ఇప్పటి వరకు ఎవరినీ కాపాడలేకపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విమానంలో 10 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు, హోంశాఖ వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement