Jaahnavi Kandula's Death Case: జాహ్నవి కందుల మృతి కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు, ఆ పోలీస్‌పై ఎలాంటి చర్యలు ఉండబోవని వెల్లడి, భారత్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన కేటీఆర్

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన సియాటిల్ పోలీసు అధికారి "తగినంత" సాక్ష్యాలు లేని కారణంగా ఎటువంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని (Will Not Face Criminal Charges) అధికారులు తెలిపారు.

Indian Student Jaahnavi Kandula Died by Police Patrol Car this Year

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్‌ కోసం అమెరికా వెళ్లి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో గతేడాది మృతి (Jaahnavi Kandula's Death Case) చెందిన సంగతి విదితమే. రోడ్డు దాటుతున్న ఆమెను.. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత ఆమె మృతిపై అక్కడి పోలీసు అధికారి (Seattle Police Officer) కెవిన్ డేవ్‌ చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్‌.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది.

ఇదిలా ఉంటే భారతీయ విద్యార్థిని జాహ్నవి కందులను కొట్టి చంపిన సియాటిల్ పోలీసు అధికారి "తగినంత" సాక్ష్యాలు లేని కారణంగా ఎటువంటి నేరారోపణలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని (Will Not Face Criminal Charges) అధికారులు తెలిపారు.బుధవారం, కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం సీటెల్ పోలీసు అధికారి కెవిన్ డేవ్‌పై నేరారోపణలతో ముందుకు సాగబోమని FOX13 సీటెల్ నివేదించింది.

అమెరికాలో తెలుగు యువతి మృతిపై కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ లేఖ, జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విన్నపం

బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ, "కందుల మరణం హృదయ విదారకంగా ఉంది మరియు కింగ్ కౌంటీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలను ప్రభావితం చేసింది.కందుల, 23, జనవరి 23న సీటెల్‌లోని ఒక వీధిని దాటుతున్నప్పుడు ఆఫీసర్ డేవ్ నడుపుతున్న పోలీసు వాహనం ఢీకొట్టింది. అతను డ్రగ్ ఓవర్ డోస్ కాల్ రిపోర్ట్‌కి వెళ్లే మార్గంలో 74 mph (119 kmh కంటే ఎక్కువ) డ్రైవ్ చేస్తున్నాడు. వేగంగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో కందుల 100 అడుగుల మేర కిందపడిపోయింది.

సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన బాడీక్యామ్ ఫుటేజ్‌లో, అధికారి డేనియల్ ఆడెరర్ ఘోరమైన క్రాష్ గురించి నవ్వుతూ డేవ్ తప్పు చేసి ఉండవచ్చు లేదా నేర పరిశోధన అవసరమని తోసిపుచ్చారు.కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ లీసా మానియన్ మాట్లాడుతూ, ఒక క్రిమినల్ కేసును సహేతుకమైన సందేహానికి మించి రుజువు చేయడానికి తమ వద్ద ఆధారాలు లేవని తాను నమ్ముతున్నట్లు నివేదిక జోడించింది.

యుఎస్‌లో తెలుగు యువతి మృతి విలువ 11 వేల డాలర్లు, అమెరికా పోలీస్ వెకిలీ కామెంట్లపై భారత్ సీరియస్, విచారణకు పిలుపు

ఈ క్రమంలో అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పు కామెంట్స్‌ను కేటీఆర్‌ ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో ఢీకొట్టి చంపిన అమెరికన్ పోలీస్‌పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు వ్యాఖ్యలు చేసింది. అతడిపై ఎలాంటి చర్యలు ఉండబోవని తెలిపింది. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి.

భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలి. అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం. అయితే ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరం అని కామెంట్స్‌ చేశారు.

స్థానిక మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం.. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రోజు ప్రమాదం జరిగిన సమయంలో కెవిన్‌ విధి నిర్వహణలోనే ఉన్నారు. ఆ రూటులో స్పీడ్ లిమిట్ 40 మైళ్లు మాత్రమే. కానీ, కెవిన్‌ తన కారును 100 మైళ్లకు పైగా వేగంతో నడిపారు. ఎమర్జెన్సీ హారన్‌ ఇవ్వలేదుగానీ.. లైట్లను వెలిగించుకుంటూ వెళ్లారు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవి.. అత్యంత వేగంతో కారు దూసుకురావడాన్ని అంచనా వేయలేకపోయారు. కారు నడుపుతున్న కెవిన్ డేవ్ కూడా జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు మాత్రమే బ్రేకులు వేశాడు. కారు బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి ఎగిరి 100 మీటర్లకు పైగా దూరంలో పడిపోయారని సీటెల్ పోలీసులు తమ నివేదికలో రిపోర్టులో పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement