Ram Mandir Temple Construction Video: అయోధ్య రామ మందిర్ లేటెస్ట్ వీడియో ఇదిగో, శరవేగంగా పూర్తవుతున్న రాముని టెంపుల్ నిర్మాణ పనులు, జనవరి 22న ప్రారంభోత్సవం
అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠతో రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామమందిర తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గోడలు, ద్వారాలపై శిల్ప కళ ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.
అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠతో రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామమందిర తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గోడలు, ద్వారాలపై శిల్ప కళ ఉట్టిపడేలా ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులకు సంబంధించిన వీడియోను రామమందిర ట్రస్టు తాజాగా విడుదల చేసింది. ‘500 ఏళ్ల పోరాటానికి ఇది ముగింపు’ అనే క్యాప్షన్తో ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
కాగా, రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మందిర ట్రస్టు సభ్యులు బుధవారం ప్రధానిని కలిసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఇది భావోద్వేగపూరిత రోజు అంటూ మోదీ ఆ తరువాత ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఈ చారిత్రాత్మక క్షణాన్ని వీక్షించే అవకాశం లభించడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. రామమందిరం ప్రారంభోత్సవంలో దేశవ్యాప్తంగా ఉన్న 136 సనాతన సంప్రదాయాలకు సంబంధించి 25 వేల మంది హిందూ సంఘాల నేతలు, మరో పాతిక వేల మంది సాధువులు, పది వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించాలని ట్రస్ట్ యోచిస్తున్నట్టు సమాచారం.
Here's Ram Mandir Temple Construction Video