Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, సహజీవనం చేస్తున్న జంట మంటల్లో సజీవ దహనం, దర్యాప్తులో ఏం తేలిందంటే..

బెంగుళూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబంలో తలెత్తిన గొడవలతో సహజీవనం చేస్తున్న ఓ జంట నిప్పంటించుకుని సజీవ దహనమయ్యారు. వారి అరుపులు విన్న చుట్టు పక్కల వాళ్లు కాపాడేందుకు ప్రయత్నించినా వారిని కాపాడలేకపోయారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఈ విషాదకర ఘటన జరిగింది.

Representative Photo (Photo Credit: PTI)

Bengaluru, Nov 9: బెంగుళూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబంలో తలెత్తిన గొడవలతో సహజీవనం చేస్తున్న ఓ జంట నిప్పంటించుకుని సజీవ దహనమయ్యారు. వారి అరుపులు విన్న చుట్టు పక్కల వాళ్లు కాపాడేందుకు ప్రయత్నించినా వారిని కాపాడలేకపోయారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఈ విషాదకర ఘటన జరిగింది.

ఘటన వివరాల్లోకెళితే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల సౌమినిదాస్ బెంగూళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్ కోర్స్ రెండో సంవత్సరం చదువుతుంది. కేరళకు చెందిన 29 ఏళ్ల అభిల్ అబ్రహం బెంగూళూరులో నర్సింగ్ సర్వీస్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు.  కొన్ని నెలల కిందటనే వీరిద్దరికి పరిచయం ఏర్పడి అది కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి బెంగుళూరులోని కొత్తనూర్ ప్రాంతంలోని ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.

కర్ణాటకలో దారుణం, భార్యపై అనుమానంతో చున్నీ బిగించి హత్య చేసిన భర్త, అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

అయితే ఆదివారం సౌమిని దాస్, అభిల్ అబ్రహం కలిసికట్టుగా నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి అరుపులు, కేకలు గమనించిన ఇరుగుపొరుగు వారు తలుపులు బద్దలు కొట్టి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈలోపే మంటల్లో కాలి సౌమిని మరణించింది. అభిల్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న బెంగుళూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో  అంతకుముందే పెళ్లైన సౌమిని దాస్ ఇటీవలే పశ్చిమ బెంగాల్ లోని సొంతూరుకు వెళ్లినట్లు గుర్తించారు. భర్తను వదిలేసి అభిల్ తో సహజీవనం చేస్తున్న చేయడం వల్ల కుటుంబంలో గొడవలు జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్‌వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో

Advertisement
Advertisement
Share Now
Advertisement