Rajinikanth Politics Row: రజనీ రాజకీయాల్లోకి రావాలి, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, చెన్నైలో రోడ్డు మీదకు వచ్చిన వేలాది మంది అభిమానులు, పార్టీ పెట్టాలని డిమాండ్
అయితే ఆయన అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోవడం లేదు. తలైవార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని (Rajinikanth Politics Row) పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా రజనీ రాయకీయాల్లోకి రావాలని, ఆయన సీఎం కావాలని పట్టుపడుతున్నారు.
Chennai, Jan 10: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోవడంతో రాజకీయాల్లోకి రాలేనంటూ ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఆయన అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోవడం లేదు. తలైవార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని (Rajinikanth Politics Row) పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా రజనీ రాయకీయాల్లోకి రావాలని, ఆయన సీఎం కావాలని పట్టుపడుతున్నారు.
చెన్నైలో ఫ్యాన్స్ క్లబ్కు చెందిన వేలాది మంది ప్రదర్శనకు దిగారు. రాజకీయంలోకి అడుగుపెట్టకూడదన్న తలైవా నిర్ణయాన్నిమార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టాలని (Fan club urges Rajinikanth to join politics) డిమాండ్ చేశారు. రజనీ రాజకీయాల్లోకి రావాలని నినాదాలు చేశారు.
తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ చెన్నైలో ఆయన అభిమానులు భారీ ప్రదర్శన నిర్వహించారు. చెన్నైలోని వళ్లువార్ కొట్టమ్లో జరిగిన ఈ ప్రదర్శనలో వందలాది మంది రజినీకాంత్ (Superstar Rajinikanth) అభిమానులు పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నానంటూ ఇటీవల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వారు కోరారు.
Here's ANI Update
మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రజినీకాంత్ గత డిసెంబర్లో సంచలన ప్రకటన చేశారు. త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన స్వల్ప అనాగ్యానికి గురై కోలుకున్నారు. కానీ, అనారోగ్యం కారణంగా రాజకీయ రంగప్రవేశం చేయాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన అభిమానులు భారీ ప్రదర్శన చేపట్టి రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న తమ ఆకాంక్షను వెల్లడించారు.
రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ సభ్యులకు వల్లూవర్ కొట్టం వద్ద ప్రదర్శన ఇవ్వడానికి చెన్నై పోలీసులు అనుమతి ఇచ్చారు. రజిని మక్కల్ మండ్రామ్ (ఆర్ఎంఎం) అగ్ర నాయకత్వం నుండి హెచ్చరిక ఉన్నప్పటికీ, ఈ రోజు ఎన్నికల రాజకీయాల నుండి నిష్క్రమించాలన్న తలైవర్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనాలని తంజావూరుకు చెందిన ఒక పార్టీ కార్యకర్త రజనీకాంత్ అభిమానులను పిలిచారు.
2021 లో తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రజనీ తాను చురుకైన రాజకీయాల్లోకి ప్రవేశించబోనని ప్రకటించిన తరువాత ఆర్ఎంఎమ్లో కొంత అశాంతి నెలకొంది, ఇది రాజకీయాల్లో చేరాలని కోరుకునే అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రతిపాదిత నిరసనలో పాల్గొనవద్దని చాలా మంది ఆర్ఎంఎం సభ్యులు అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
Tags
సంబంధిత వార్తలు
Prostitution Racket Busted: స్పా సెంటర్లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు, ముగ్గురు విటులతో సహా ఇద్దరు యజమానులు అరెస్ట్
Chennai Sex Racket: 70 ఏళ్ల ముసలి తాతల రూంకి కాలేజి అమ్మాయిలు, వారి రేటు రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు, చెన్నైలో సెక్స్ రాకెట్ చేధించిన పోలీసులు, నిందితులు అరెస్ట్
IPL 2024 Playoffs Schedule:ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ఇదిగో, తొలి క్వాలిఫియర్లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు ఢీ, మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ మ్యాచ్
RCB Vs CSK: ఆర్సీబీ మ్యాచ్ కు వానగండం, 3 ఓవర్లకే నిలిచిపోయిన మ్యాచ్, అప్పటి వరకు స్కోర్ ఎంతంటే?
CM Jagan on Election Results: ఏపీలో మనం కొట్టే సీట్లతో ప్రశాంత్ కిషోర్ మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి
Andhra Pradesh Elections 2024: జగన్కు అండగా నిలవండి, ఏపీ ముస్లిం ఓటర్లను కోరిన అసదుద్దీన్ ఒవైసీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లకు చరమగీతమే..
Condom Politics: పిల్లలు ఎక్కువ మంది పుట్టకుండా కండోమ్లు వాడేది ముస్లింలే, ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన అసదుద్దీన్ ఒవైసీ
YSRCP Manifesto Today: వైసీపీ మేనిఫెస్టో నేడే విడుదల.. ఆవిష్కరించనున్న సీఎం జగన్.. పారిశ్రామికీకరణ, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం.. అమ్మఒడి, పెన్షన్లు, రైతు భరోసా, చేదోడు నిధుల పెంపునకు ఛాన్స్.. ఈసారి మరో 2 కొత్త పథకాలు ఉండే అవకాశం
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Telangana Capital Hyderabad: హైదరాబాద్ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్తో అలరించిన గూగుల్
Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ
Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ