Fodder Scam Case: దాణా కుంభ‌కోణం కేసులో దోషిగా తేలిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్, ఈ కేసులో ఇప్పటికే 14 ఏళ్ల జైలుశిక్ష, ఇప్ప‌టి వ‌ర‌కు 3.5 ఏళ్లు జైలు జీవితం గడిపిన బీహార్ మాజీ సీఎం

బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ దాణా కుంభ‌కోణం కేసులో (Fodder Scam Case) దోషిగా తేలారు. దొరండా ట్రెజ‌రీ నుంచి అక్ర‌మ‌రీతిలో నిధులు ఖాళీ చేసిన కేసులో రాంచీలోని ప్ర‌త్యేక సీబీఐ కోర్టు ఇవాళ తీర్పును వెలువ‌రించింది. జ‌డ్జి సీకే శ‌శి ఆదేశాల మేర‌కు లాలూ ప్ర‌సాద్ (Lalu Prasad Yadav) ఇవాళ భౌతికంగా కోర్టుకు హాజ‌ర‌య్యారు.

Lalu Prasad Yadav (Photo Credits: PTI)

Ranchi, February 15: బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ దాణా కుంభ‌కోణం కేసులో (Fodder Scam Case) దోషిగా తేలారు. దొరండా ట్రెజ‌రీ నుంచి అక్ర‌మ‌రీతిలో నిధులు ఖాళీ చేసిన కేసులో రాంచీలోని ప్ర‌త్యేక సీబీఐ కోర్టు ఇవాళ తీర్పును వెలువ‌రించింది. జ‌డ్జి సీకే శ‌శి ఆదేశాల మేర‌కు లాలూ ప్ర‌సాద్ (Lalu Prasad Yadav) ఇవాళ భౌతికంగా కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మ‌రో 98 మందిని కూడా నేరుగా హాజ‌రుకావాల‌ని కోర్టు ఆదేశించింది. 1996లో తొలిసారి దొరండా ట్రెజ‌రీ కేసు (Doranda Treasury by CBI Special Court) న‌మోదు అయ్యింది. భారతీయులు వెంటనే ఉక్రెయిన్ వదిలి దేశానికి రండి, ర‌ష్యా వైమానిక దాడులు చేసే అవ‌కాశాలున్నాయని తెలిపిన దౌత్య కార్యాల‌యం

ఆ స‌మ‌యంలో 170 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసుతో లింకు ఉన్న 55 మంది ఇప్ప‌టికే మ‌ర‌ణించారు. దాణా కుంభ‌కోణంలో దొరండా ట్రెజ‌రీ కేసులో అయిద‌వ‌ది. మొత్తం 950 కోట్ల దాణా కుంభ‌కోణానికి లాలూ పాల్పిడిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. లాలూ ప్ర‌సాద్ ప్ర‌భుత్వం ప‌శువుల మేత కోసం నిధులు దుర్వినియోగం చేసిన‌ట్లు కేసులు న‌మోదు అయ్యాయి. దాణా కుంభ‌కోణం కేసులో 14 ఏళ్ల జైలుశిక్ష ప‌డ‌గా.. లాలూ ఇప్ప‌టి వ‌ర‌కు 3.5 ఏళ్లు జైలు జీవితాన్ని అనుభవించారు. దొరండా ట్రెజ‌రీ నుంచి 139.35 కోట్ల‌ను స్వాహా చేశారు. ఈ కేసులో 36 మందికి మూడేళ్ల జైలు శిక్ష ప‌డింది. లాలూ ప్ర‌సాద్‌కు ఇంకా శిక్ష‌ను ప్ర‌క‌టించ‌లేద‌ని డిఫెన్స్ లాయ‌ర్ సంజ‌య్ కుమార్ తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement