PM Modi Interacts With Bill Gates: AI నుండి UPI వరకు, భారత్ డిజిటల్ విప్లవంపై బిల్ గేట్స్‌-ప్ర‌ధాని మోదీ మధ్య చర్చా కార్యక్రమం, హైలెట్స్ ఇవిగో..

మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్‌, ప్ర‌ధాని మోదీ(PM Modi-Bill Gates) చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ప్ర‌ధాని మోదీ నివాసంలో ఈ చ‌ర్చా కార్య‌క్ర‌మం జ‌రిగింది. కృత్రిమ మేధ‌(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) నుంచి డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, వాతావ‌ర‌ణ మార్పులు లాంటి అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

PM Narendra Modi with Bill Gates (photo-ANI)

New Delhi, Mar 29: మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్‌, ప్ర‌ధాని మోదీ(PM Modi-Bill Gates) చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ప్ర‌ధాని మోదీ నివాసంలో ఈ చ‌ర్చా కార్య‌క్ర‌మం జ‌రిగింది. కృత్రిమ మేధ‌(ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) నుంచి డిజిట‌ల్ ప‌బ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, వాతావ‌ర‌ణ మార్పులు లాంటి అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఆయనతో జరిపిన సంభాషణలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అనేక అంశాలపై చర్చించారు.

బిల్ గేట్స్, నరేంద్ర మోడీ మధ్య సంభాషణ (PM Modi Interacts With Bill Gates) కృత్రిమ మేధస్సుపై నొక్కిచెప్పింది. ఇద్దరూ భారతదేశ AI మిషన్ గురించి చర్చించారు, దీనికి బడ్జెట్ కేటాయింపు కూడా వచ్చింది.సాంకేతిక పరిజ్ఞానానికి అనుసరణ, పరిపాలన పాత్ర కోసం సాంకేతికతను స్వీకరించడంలో భారతదేశం పాత్రను బిల్ గేట్స్ ప్రశంసించారు. బిల్ గేట్స్ మాట్లాడుతూ.. మనది డిజిటల్ ప్రభుత్వం లాంటిది. భారతదేశం సాంకేతికతను స్వీకరించడమే కాదు, వాస్తవానికి దారి తీస్తోందన్నారు. రీసైకిల్ చేసిన మెటీరియల్‌తో తయారు చేసిన జాకెట్‌ను ధరించిన మోదీ, బిల్ గేట్స్‌తో చర్చల్లో పాల్గొన్న భారత ప్రధాని, వీడియో ఇదిగో..

ఇవి AIలో ప్రారంభ రోజులు... ఇది మీరు కష్టమని భావించే పనులను చేస్తుంది. మీరు తేలికగా భావించే పనిని చేయడంలో విఫలమవుతుంది. AI అనేది చాలా గొప్ప అవకాశంగా అనిపిస్తుంది కానీ దానితో వచ్చే సవాళ్లు కొన్ని ఉన్నాయి. భారతదేశం సాంకేతికతను స్వీకరించడమే కాదు, అది మార్గనిర్దేశం చేస్తోంది" అని బిల్ గేట్స్ అన్నారు.భార‌తీయ‌ల‌ను బిల్ గేట్స్ ప్ర‌శంసించారు. టెక్నాల‌జీని భార‌తీయుల చాలా వేగంగా ఆపాదించుకున్నార‌న్నారు. సాంకేతిక రంగంలో భార‌త్ దూసుకెళ్తున్న‌ట్లు కూడా గేట్స్ తెలిపారు. పీఎం న‌మో యాప్‌లో ఉన్న ఫోటో బూత్ ఆప్ష‌న్ ద్వారా బిల్ గేట్స్‌తో ప్ర‌ధాని సెల్ఫీ దిగారు.

Here's Videos

PM నరేంద్ర మోదీ, బిల్ గేట్స్ వాతావరణ మార్పుపై కూడా చర్చించారు. అభివృద్ధి వాతావరణానికి వ్యతిరేకం కనుక అభివృద్ధిని నిర్వచించడానికి ప్రపంచం విద్యుత్ లేదా ఉక్కు వంటి పారామితులను మార్చాల్సిన అవసరం ఉందని, బదులుగా గ్రీన్ GDP, గ్రీన్ ఎంప్లాయ్‌మెంట్ వంటి పదాలను అనుసరించాలని ప్రధాని మోడీ అన్నారు.డిజిటిల్ విప్ల‌వంలో ఇండియా వేగంగా ముందుకు వెళ్తోంద‌ని, ఆరోగ్యం, వ్య‌వ‌సాయం, విద్యా రంగాల్లో కూడా భార‌త్ ముందుకు వెళ్తోంద‌ని మోదీ అన్నారు.

ఇండోనేషియాలో జీ20 శిఖ‌రాగ్ర స‌ద‌స్సు జ‌రిగిన స‌మ‌యంలో భార‌త్‌లో జ‌రుగుతున్న డిజిట‌ల్ విప్ల‌వం గురించి ప్ర‌పంచ దేశాలు త‌మ ఉత్సుక‌త‌ను ప్ర‌ద‌ర్శించాయ‌ని, అయితే ఏక‌ఛ‌త్రాధిప‌త్యాన్ని నిర్మూలించేందుకు టెక్నాల‌జీని ప్ర‌జాస్వామ్యంగా మార్చామ‌ని ఆ స‌ద‌స్సులో చెప్పిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల కోసం టెక్నాల‌జీని అందిస్తున్నామ‌న్నారు.

జీ20 స‌ద‌స్సు స‌మ‌గ్ర స్థాయిలో జ‌రిగింద‌ని, ఇండియా ఆ స‌ద‌స్సును అద్భుతంగా నిర్వహించింద‌ని బిల్ గేట్స్ పేర్కొన్నారు. భార‌త్‌లో డిజిట‌ల్ విభ‌జ‌న జ‌ర‌గ‌కుండా చూస్తాన‌ని, డిజిట‌ల్ మౌళిక స‌దుపాయాల్ని ప్ర‌తి గ్రామానికి తీసుకువెళ్తాన‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ 'నమో డ్రోన్ దీదీ' పథకం గురించి బిల్ గేట్స్‌తో చెప్పారు. దేశంలో సాంకేతికతను ముఖ్యంగా మహిళల్లో ప్రోత్సహించడంలో ఇది సహాయపడే మార్గాలను హైలైట్ చేశారు.

ప్రపంచంలో డిజిటల్ విభజన గురించి నేను విన్నప్పుడు, నా దేశంలో అలాంటిదేమీ జరగదని నేను భావించాను, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు దానికదే ప్రధాన అవసరం... భారతదేశంలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే నేను 'నమో డ్రోన్ దీదీ' పథకాన్ని ప్రారంభించాను... ఇది చాలా విజయవంతంగా కొనసాగుతోంది, ఈ రోజుల్లో నేను వారితో సంభాషిస్తున్నాను, వారు ఆనందంగా ఉన్నారు, వారికి రైడ్ చేయడం తెలియదని వారు చెప్పారు. ఒక సైకిల్ కూడా తొక్కడం రాని వారు ఇప్పుడు పైలట్లు, డ్రోన్‌లను ఎగరవేయగలరు. ఆలోచనా విధానం మారిందని ప్రధాని అన్నారు.

కోవిడ్ క‌ట్ట‌డిలో భార‌త్ పాత్ర‌ను ప్ర‌ధాని మోదీ.. బిల్ గేట్స్‌కు వివ‌రించారు. డిజిట‌ల్ రంగంలో భార‌త్ చాలా మార్పులు తీసుకువ‌చ్చింద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. విద్యారంగంలో మార్పుల‌కు టెక్నాల‌జీ వినియోగిస్తున్నామ‌న్నారు. జీ20 స‌ద‌స్సులో ఏఐ వినియోగించామ‌న్నారు. టెక్నాల‌జీ అల‌స‌త్వానికి దారి తీయ‌వ‌ద్దు అని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం అవ‌స‌రం ఉన్న పేద‌ల‌కు టెక్నాల‌జీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. టెక్నాల‌జీ వ‌ల్ల పేద‌ల‌కు అన్నీ అందుతున్నాయ‌న్నారు. చిరుధాన్యాల సాగుతో చిన్న రైతులు అభివృద్ధి చెంద‌తున్నార‌ని తెలిపారు. పెద్ద హోట‌ళ్ల‌లోనూ చిరుధాన్యాల వంట‌కాలు పెరిగాయ‌న్నారు.

ప్ర‌జ‌ల్లో విశ్వాసం, చైత‌న్యం నింపే అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై అపోహ‌లు, అనుమానాలు నివృత్తి చేశామ‌న్నారు. త‌న‌ త‌ల్లితో క‌లిసి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. న‌మో డ్రోన్ దీదీ ప‌థ‌కం స‌క్సెస్‌ఫుల్‌గా అమ‌లు అవుతోంద‌న్నారు.

స్కూల్ టీచ‌ర్ల కొర‌త‌ను అధిగ‌మించేందుకు ఏఐను వాడుతున్నామ‌న్నారు. డిజిట‌ల్ మార్పుల‌తో దేశానికి ప్ర‌యోజ‌నం జ‌రిగింద‌ని మోదీ అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now