Second Wave in India: భారత్లో నిన్నటితో పోలిస్తే కొద్ది మొత్తంలో పెరిగిన కోవిడ్19 కేసులు, దేశవ్యాప్తంగా కొత్తగా 67,208 మందికి పాజిటివ్, మరో 1 లక్ష మందికి పైగా రికవరీ
గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 34,63,961 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 26.55కోట్లు దాటింది....
New Delhi, June 17: భారత్లో సెకండ్ వేవ్ కరోనా అదుపులోకి వస్తోంది, ప్రతిరోజూ నమోదయ్యే రోజూవారీ కోవిడ్ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులున్నప్పటికీ పాజిటివిటీ రేటు క్రమంగా పడిపోతుండగా, కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకి మెరుగుపడుతోంది. తాజాగా దేశంలో కోవిడ్ రికవరీ రేటు 96 శాతానికి పెరిగింది. ఫలితంగా ఆక్టివ్ కేసులు తగ్గుతున్నాయి, ప్రస్తుతం 71 రోజుల కనిష్ఠానికి ఆక్టివ్ కేసులు చేరడం ఊరట కలిగిస్తుంది. కేసులు తగ్గుతుండటంతో చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు దశల వారీగా ఎత్తివేస్తున్నారు.
గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 67,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కేసులు స్వల్పంగా సుమారు 5 వేల మేర పెరిగాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,00,313 చేరింది. నిన్న ఒక్కరోజే 2,330 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,81,903కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,03,570 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,84,91,670 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,26,740 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.93% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 2.78 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.29% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
జూన్ 16 నాటికి దేశవ్యాప్తంగా 38,52,38,220 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,31,249 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 34,63,961 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 26.55కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 26,55,19,251 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 21.58 కోట్లు ఉండగా, 4.96 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.
Tags
సంబంధిత వార్తలు
Covishield Side Effects: కోవిషీల్డ్ టీకాతో ప్రాణాంతక వీఐటీటీ, అరుదైన ప్రాణాంతక రుగ్మతకు దారితీస్తున్న వ్యాక్సిన్, ఆస్ట్రేలియా పరిశోధనలో మరిన్ని కొత్త విషయాలు
Covaxin Side Effects: కొవాగ్జిన్ టీకా తీసుకున్న మహిళల్లో పడిపోతున్న ప్లేట్లెట్లు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి, కౌమారదశలో ఉన్న మహిళలకు ఏఈఎస్ఐ ముప్పు
What is FLiRT? కొత్త కోవిడ్ FLiRT వేరియంట్ లక్షణాలు, చికిత్స మార్గాలు ఇవిగో, భారత్లో పెరుగుతున్న కొత్త కరోనా వేరియంట్ కేసులు
New COVID-19 Variant ‘FLiRT’: భారత్లో కొత్త కరోనా వేరియంట్ FLiRT కలకలం, ఇప్పటివరకు దేశంలో 250 కేసులు నమోదు, కోవిడ్-19 వేరియంట్ ఆందోళనపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
Covishield Caused Deaths? కోవిషీల్డ్ కారణంగా తమ పిల్లలు చనిపోయారంటూ కోర్టు గడపతొక్కిన తల్లిదండ్రులు, రక్తం గడ్డకట్టే ప్రమాదకర స్థితికి వ్యాక్సిన్ కారణమైందని వెల్లడి
AstraZeneca Withdraws COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్లను వెనక్కు రప్పిస్తున్న ఆస్ట్రాజెనెకా! సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని రుజువవ్వడంతో కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ
Bird Flu Pandemic: కోవిడ్ కంటే 100 రెట్లు ప్రమాదకరంగా బర్డ్ ఫ్లూ మహమ్మారి, కరోనా వైరస్ వ్యాప్తి కన్నా ఘోరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిక
COVID-19 Vaccination: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి గుండె సమస్యలు నిజమే! డబ్లూహెచ్ వో పరిశోధనల్లో తేలిన సంచలన విషయాలు
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Ex Minister Mallareddy Arrest: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
BCCI Bans Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ఐపీఎల్ -2025 సీజన్ లో తొలి మ్యాచ్ కు హార్దిక్ పై బీసీసీఐ నిషేధం.. రూ. 30 లక్షల భారీ జరిమానా కూడా
Guru Charan Singh: కనిపించకుండా పోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఎట్టకేలకు ఇంటికి.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే??
Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి.. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని పేర్కొంటూ దాడి చేసిన వ్యక్తులు (వీడియో వైరల్)