COVID19 in India: భారత్లో కొత్తగా 3,43,144 పాజిటివ్ కేసులు మరియు 4,000 కోవిడ్ మరణాలు నమోదు, 37,04,893కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 83.50% స్వల్పంగా మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 15.41 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.09% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
New Delhi, May 14: భారత్లో రోజూవారీ కోవిడ్ కేసులు నిన్నటికంటే ఈరోజు స్వల్పంగా తగ్గాయి. అయితే రికవరీలు పెరిగాయి. ఒకరోజులో నమోదైన కేసుల కంటే కోలుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం. కానీ, గత కొంతకాలంగా కోవిడ్ మరణాల రేటులో ఎలాంటి తగ్గుదల లేకపోవడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి, వైరస్ వ్యాప్తిని వారి వారి పద్ధతుల్లో ఎక్కడికక్కడ కట్టడి చేసే నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 3,43,144 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,46,809 చేరింది. నిన్న ఒక్కరోజే 4,000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,62,317కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,44,776 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,00,79,599 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 37,04,893 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 83.50% స్వల్పంగా మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 15.41 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.09% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
మే 13 నాటికి దేశవ్యాప్తంగా 31,13,24,100 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 18,75,515 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో 45 ఏళ్ల పైబడిన వారికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. తర్వాత విడతల వారీగా 18 నుంచి 45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 17.92 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 17,92,98,584
మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)