Representative Image

Indian Navy Warships Deployed in Arabian Sea: పైరసీ, డ్రోన్‌ దాడులను అరికట్టేందుకు భారత నావికాదళం తన ఉనికిని పెంచుకుంటూ ఉత్తర, మధ్య అరేబియా సముద్రం నుంచి ఏడెన్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో మెరైన్ కమాండోలతో దాదాపు 10 ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలను (Indian Navy Warships Deployed in Arabian Sea) మోహరించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.

6-10 ప్రధాన స్వదేశీ ఇండియన్ నేవీ యుద్ధనౌకలు, సెస్ట్రాయర్‌లు, యుద్ధనౌకలు, ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ ఓడలు, అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో సోమాలియా తీరానికి సమీపంలో ప్రత్యేక దృష్టి సారించి వ్యాపార నౌకలపై పైరసీ, డ్రోన్ దాడులను నిరోధించడానికి ఇవి రెడిగా ఉన్నాయని నేవీ అధికారులు తెలిపారు.

అరేబియా సముద్రంలో షిప్పులపై డ్రోన్ దాడులు, కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ నేవీ,సముద్రంలో గస్తీ కోసం మూడు ఐఎన్‌ఎస్‌ వార్‌షిప్పులు రంగంలోకి..

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సముద్రంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా భారత యుద్ధ నౌకలు పరిస్థితిని గమనిస్తున్నాయి. అరేబియా సముద్రంలో భారతీయ వాణిజ్య నౌకలపై ఇటీవల వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో, సముద్రపు దొంగలను అరికట్టేందుకు భారత నావికాదళం ముందస్తుగా తమ నౌకాదళాన్ని మోహరిస్తున్నదని (India Deploys Warships in Arabian Sea) నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ బుధవారం తెలిపారు.

బుధవారం హైదరాబాద్‌లో తొలిసారిగా స్వదేశీ తయారీ దృష్టి 10 స్టార్‌లైనర్ మానవరహిత వైమానిక వాహనం (యుఎవి)ని ఆవిష్కరించిన అనంతరం నేవీ చీఫ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గత 42 రోజులలో, ఇటువంటి 35 దాడులు (సుమారుగా) జరిగాయి. అయితే, భారతదేశం జెండాతో ఉన్న ఏ నౌకపై ఇప్పటి వరకు దాడి జరగలేదు. ఇజ్రాయెల్ యాజమాన్యంలోని ఓడలపై జరిగాయి.మేము ఇప్పుడు, చాలా చురుగ్గా, సముద్రపు దొంగల అటాక్ చేయకుండా ఉండేలా మా యూనిట్లను అక్కడ మోహరిస్తున్నామన్నారు.

ఇప్పటివరకు భారతీయులు ఉండే ఓడలపై దాడులు కేవలం రెండు సంఘటనలు జరిగాయని, ఇది సముద్రపు యోధులను పైరసీ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రేరేపించిందని తెలిపారు. రెండు సంఘటనల్లోనూ భారతీయ జెండాలు లేని నౌకలు ఉన్నాయి. రెండవ సంఘటనలో ఓడలో భారతీయ సిబ్బంది ఉన్నారు. అందువల్ల నేవీ స్పందించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.



సంబంధిత వార్తలు

AARAA Exit Poll: పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటున్న ఆరా మస్తాన్ సర్వే, లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడి

Andhra Pradesh Assembly Exit Poll: ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, అధికార వైసీపీకే మొగ్గు చూపిన మెజార్టీ సర్వేలు

Telangana Exit Poll: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే టఫ్ పైట్, బీజేపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్న సర్వేలు

Lok Sabha Exit Poll: అధికార బీజేపీ కూటమికే పట్టం కట్టిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల మధ్య వస్తాయంటే..

Andhra Pradesh Lok Sabha Exit Poll: ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

Operation Chanakya Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన ఆపరేషన్ చాణక్య సర్వే, 95 నుంచి 102 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 64 నుంచి 68 సీట్ల మధ్యలో టీడీపీ

Chanakya Strategies Exit Poll: 114 నుంచి 125 సీట్లతో టీడీపీ అధికారంలోకి, 39 నుంచి 49 సీట్ల మధ్యలో వైసీపీ, Chanakya strategies Exit Poll ఇదిగో..

Avian Influenza Alert: ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ డేంజర్ బెల్స్, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, మానవులకూ సోకే ఆస్కారం ఉందని వెల్లడి