Indian Railways: ప్యాసెంజర్ రైళ్ల రద్దును మే 17 వరకు పొడగించిన భారతీయ రైల్వే, అడ్వాన్స్ బుకింగ్స్ నిలిపివేత, ప్రత్యేక శ్రామిక్ రైళ్లు మరియు గూడ్స్ సర్వీస్ రైళ్లు నడుస్తాయని వెల్లడి

కరోనావైరస్ లాక్డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించిన నేపథ్యంలో అందుకనుగుణంగా భారతీయ రైల్వే శాఖ కూడా అన్ని రకాల ప్యాసెంజర్ రైలు సర్వీసులను మే 17 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని ముందస్తు బుకింగ్‌లు నిలిపివేయబడతాయి. ఇ-టికెట్‌ ద్వారా కూడా అడ్వాన్స్ రిజర్వేషన్లు అనుమతించబడవు అయితే......

Image of Indian Railways |(Photo Credits: Flickr)

New Delhi, May 2: కేంద్రం ప్రభుత్వం కరోనావైరస్ లాక్డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన నేపథ్యంలో అందుకనుగుణంగా భారతీయ రైల్వే శాఖ కూడా అన్ని రకాల ప్యాసెంజర్ రైలు సర్వీసులను మే 17 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్ని ముందస్తు బుకింగ్‌లు నిలిపివేయబడతాయి. ఇ-టికెట్‌ ద్వారా కూడా అడ్వాన్స్ రిజర్వేషన్లు అనుమతించబడవు అయితే టికెట్ క్యాన్సలేషన్ సౌకర్యం మాత్రం ఆన్‌లైన్ లో యాక్టివ్ గా ఉంచుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

అయినప్పటికీ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారంతో లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు మొదలగు వారిని తమ సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు "శ్రామి స్పెషల్" రైళ్లను నడుపుతామని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ANI's Update :

ప్రతి ప్రత్యేక రైలులో 1,000-1,200 మంది ప్రయాణికులు, ప్రయాణించనున్నారు. ఎవర్ని పంపించాలనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే జాబితా సిద్ధం చేయాలి. దాని ప్రకారం ఆ రాష్ట్రానికి నియమింపబడిన నోడల్ అధికారికి ఒకేసారి బల్క్ టికెట్లను రైల్వేశాఖ జారీ చేయనుంది.

ప్రయాణికులకు నిర్ధేషించబడిన రైల్వే స్టేషన్లో మాస్క్ లు, శానిటైజర్స్, ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లను వారిని తరలించే రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఒకవేళ దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటే రైలులోనే భోజన వసతి కల్పిస్తారు.

ప్రయాణికులందరినీ నాన్- ఏసీ కోచ్ లలోనే తరలించనున్నారు. నాన్ స్లీపర్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ బోగీ యొక్క ఒక్కో విభాగంలో 6 మందిని తరలించనున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా వీరందరికీ రైలు ఎక్కేముందు స్క్రీనింగ్ నిర్వహిస్తారు. కరోనా లక్షణాలు లేనపుడే ప్రయాణానికి అనుమతిస్తారు. అంతేకాకుండా గమ్యస్థానం చేరిన తర్వాత కూడా స్క్రీనింగ్ నిర్వహిస్తారు, అవసరమనుకుంటే క్వారైంటైన్ కేంద్రాలకు తరలించే అవకాశమూ ఉంటుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్‌, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి

Rules Change In Railways: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

Special Buses For Maha Shivarathri: మహాశివరాత్రి సందర్భంగా శివయ్య దర్శనానికి వెళ్లాలనుకున్నవారికి గుడ్ న్యూస్.. 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌ను గుర్తించిన సైంటిస్టులు

Advertisement
Advertisement
Share Now
Advertisement