COVID-19 in India: భారత్లో మరో 18 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు, దేశంలో 63కు పెరిగిన కరోనా కేసుల సంఖ్య, కేరళలో గప్చుప్గా విస్తరిస్తున్న వైరస్
చాలా మంది విదేశీ పర్యటనలు చేసి వచ్చిన వారు తమ విషయాలను దాచి పెట్టడంతో ఇక్కడ పరిస్థితి ముదురుతోంది. వ్యాధి తీవ్రత పెరిగేంత వరకు ఆసుపత్రికి రావడం లేదు, బయటి దేశాలు తిరిగి వచ్చి వైరస్ లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ ఆ వివరాలు గోప్యంగా ఉంచుతూ నలుగురిలో తిరగడం వలన, వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి కేసులు పెరుగుతున్నాయి.....
New Delhi, March 11: భారత్ (India) లో బుధవారం నాటికి మరో 18 కొత్త కరోనావైరస్ పాజిటివ్ (COVID 19 Positive) కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళ నుంచి 8, మహారాష్ట్ర నుంచి 5, కర్ణాటక నుంచి 4 మరియు జమ్మూ కాశ్మీర్ నుంచి 1 ఉన్నాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 63కు పెరిగింది, ఈ సంఖ్య సాయంత్రం నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది.
మహారాష్ట్రలోని 5 కేసులు పుణె నగరం నుంచి నమోదయ్యాయి. పుణెకు చెందిన భార్యాభర్తలు మరియు వారి కూతురు, వారితో పాటు ఇంకొకరు కలిసి ఇటీవల 40 మంది బృందంతో కలిసి దుబాయి పర్యటనకు వెళ్లి మార్చి 1న తిరిగి వచ్చారు. వీరికి వైద్యపరీక్షలు నిర్వహించగా ఈ నలుగురికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వీరితో పాటు ముంబై విమానాశ్రయం నుంచి పుణె వరకు వీరిని తీసుకువచ్చిన క్యాబ్ డ్రైవర్ కు కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నారు.
ఇక కేరళలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు కేరళ నుంచే నమోదవుతున్నాయి. తాజాగా 8 కొత్త కేసులు నమోదయ్యాయి. చాలా మంది విదేశీ పర్యటనలు చేసి వచ్చిన వారు తమ విషయాలను దాచి పెట్టడంతో ఇక్కడ పరిస్థితి ముదురుతోంది. వ్యాధి తీవ్రత పెరిగేంత వరకు ఆసుపత్రికి రావడం లేదు, బయటి దేశాలు తిరిగి వచ్చి వైరస్ లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ ఆ వివరాలు గోప్యంగా ఉంచుతూ నలుగురిలో తిరగడం వలన, వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి కేసులు పెరుగుతున్నాయి. కరోనా చికిత్సకు ఎయిడ్స్ మందులు, జైపూర్ ఆసుప్రతిలో ఇటలీ పేషంట్లకు ట్రీట్మెంట్
దీంతో కేరళ ప్రభుత్వం ఈ పరిస్థితిపై సీరియస్ గా దృష్టి పెట్టింది. విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు తమ యాత్రలకు సంబంధించిన వివరాలు వెల్లడించకపోతే అది నేరం అని, వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇక రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం గుంపులుగా సంచరించకుండా కొన్ని నిషేధాజ్ఞలు జారీచేసింది. విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, తదితర వాటిపై మార్చి నెలాఖారు వరకు మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)