YS Family's Property Dispute: ఆడ‌బిడ్డ క‌న్నీరు జగన్ ఇంటికి అరిష్టం, వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదంపై స్పందించిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి

మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, ఆయ‌న సోద‌రి, ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల వివాదం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మాజీ మంత్రి, జ‌న‌సేన నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తాజాగా స్పందించారు. వైఎస్ కుటుంబం ఆస్తుల కోసం త‌గదాలు ప‌డ‌టం బాధాక‌రమ‌ని అన్నారు.

It's very sad that YS family fights over property: Ex-minister Balineni Srinivasa Reddy

మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, ఆయ‌న సోద‌రి, ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల వివాదం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మాజీ మంత్రి, జ‌న‌సేన నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తాజాగా స్పందించారు. వైఎస్ కుటుంబం ఆస్తుల కోసం త‌గదాలు ప‌డ‌టం బాధాక‌రమ‌ని అన్నారు. ఆడ‌బిడ్డ క‌న్నీరు ఆ ఇంటికి అరిష్ట‌మ‌ని పేర్కొన్నారు.

ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం వైఎస్ విజ‌య‌మ్మ ముందుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వేరే వాళ్లు దీనిలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని బాలినేని కోరారు. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌ని హితవు పలికారు. తాను ఏ పార్టీలో ఉన్నా వైఎస్ కుటుంబం బాగుండాల‌ని కోరుకుంటానని చెప్పారు.

ఆస్తి తగాదా..అధికారం తగాదా?, జగన్‌కు లేఖ రాస్తే చంద్రబాబుకు ఎలా చేరిందో షర్మిల చెప్పాలన్న విజయసాయి రెడ్డి

ఆస్తులు సంపాదించుకుని పార్టీ మారిన‌ట్టు త‌న‌పై కొంద‌రు వైసీపీ నేత‌లు అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని బాలినేని మండిప‌డ్డారు. వైసీపీలో ఉన్నప్పుడు త‌న ఆస్తులు పోగొట్టుకున్నాను త‌ప్పితే, సంపాదించుకోలేద‌ని త‌న కుమారుడి సాక్షిగా చెప్పారు. త‌న తండ్రి, కోడ‌లి ఆస్తి అమ్మి తాను చేసిన అప్పులను తీర్చిన‌ట్టు తెలిపారు. ఈ విష‌యం జ‌గ‌న్‌కు కూడా తెలుస‌ని పేర్కొన్నారు.

Balineni on YS Family's Property Dispute

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిసిన‌ప్పుడు ఎన్నిక‌ల‌కు ముందే పార్టీలోకి తీసుకుందామ‌నుకున్న‌ట్టు చెప్పార‌ని గుర్తు చేశారు. కానీ జ‌గ‌న్‌కు బంధువు కావ‌డంతో అడ‌గలేక‌పోయాన‌ని పవన్ త‌న‌తో చెప్పిన‌ట్లు బాలినేని తెలిపారు. ఆయ‌న హుందాగా మాట్లాడ‌టం త‌న‌కు న‌చ్చింద‌న్నారు. ఇక మంత్రి ప‌ద‌వి వ‌దులుకుని జ‌గ‌న్ వెంట న‌డిస్తే.. ఆ పార్టీలో త‌న‌కు ఏం జ‌రిగిందో ప్ర‌జ‌ల‌కు తెలుసునని బాలినేని పేర్కొన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Man Lifting Bike Over Train Barrier: నా ముందే రైలు గేటు వేస్తారా? అనుకున్నడో ఏమో.. రైల్వే క్రాసింగ్‌ ను దాటేందుకు.. ఈ బైకర్‌ ఏం చేశాడో తెలుసా? (వైరల్ వీడియో)

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement