Jharkhand Shocker: చిన్న గొడవ..స్నేహితుడిని మూడు ముక్కలుగా నరికి అడవిలో పడేసిన మరో ఇద్దరు స్నేహితులు, జార్ఖండ్‌లోని దియోఘ‌ర్ జిల్లాలో దారుణ ఘటన

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన (Jharkhand Shocker) చోటు చేసుకుంది. ముగ్గురి స్నేహితుల మ‌ధ్య చోటు చేసుకున్న వివాదం ఓ స్నేహితుడిని బ‌లిగొంది. స్నేహితుడిని మ‌రో ఇద్ద‌రు తోటి స్నేహితులు మూడు ముక్క‌లుగా న‌రికేసి (Hands And Legs Chopped Off) అడ‌వుల్లోకి విసిరేశారు. ఈ దారుణ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని దియోఘ‌ర్ జిల్లాలో వెలుగు చూసింది.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Deoghar, Dec 23: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన (Jharkhand Shocker) చోటు చేసుకుంది. ముగ్గురి స్నేహితుల మ‌ధ్య చోటు చేసుకున్న వివాదం ఓ స్నేహితుడిని బ‌లిగొంది. స్నేహితుడిని మ‌రో ఇద్ద‌రు తోటి స్నేహితులు మూడు ముక్క‌లుగా న‌రికేసి (Hands And Legs Chopped Off) అడ‌వుల్లోకి విసిరేశారు. ఈ దారుణ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని దియోఘ‌ర్ జిల్లాలో వెలుగు చూసింది.

దారుణ ఘటన వివ‌రాల్లోకి వెళ్తే.. రోహిణి గ్రామానికి చెందిన ఓ ఇద్ద‌రు స్నేహితులు మంగ‌ళ‌వారం రాత్రి 8:30 గంట‌ల స‌మ‌యంలో కుమ్ర‌బాద్ స్టేష‌న్ రోడ్‌కు వెళ్లారు. అక్క‌డ అవినాష్‌(19) అనే ఫ్రెండ్‌ను ఈ ఇద్ద‌రు క‌లిశారు. అయితే ఈ ముగ్గురు క‌లిసి స్థానికంగా ఉన్న పహాడ్ జంగిల్ వైపు వెళ్తుండ‌గా, అవినాష్‌తో 14 ఏండ్ల యువ‌కుడికి స్వ‌ల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆవేశంతో ర‌గిలిపోయిన స్నేహితుడు అవినాష్‌.. ఆ యువ‌కుడి కాళ్లు, చేతులు క‌ట్టేసి అత్యంత దారుణంగా క‌త్తితో పొడిచి (14-Year-Old Boy Killed By Friends) చంపాడు.

అంత‌టితో ఆగ‌కుండా మృత‌దేహాన్ని మూడు ముక్క‌లుగా న‌రికేసి, గోనె సంచుల్లో చుట్టి అడ‌విలోకి (Body Dumped In Forest) విసిరేశారు. అయితే త‌మ కుమారుడి అదృశ్యంపై త‌ల్లిదండ్రులు బుధవారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అవినాష్‌ను అరెస్టు చేశారు, నిందితుల‌ను 24 గంట‌ల్లోనే అరెస్టు చేశారు. బాధితుడి వద్ద రక్తంతో తడిసిన కత్తి, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృత‌దేహాన్ని మూడు ముక్క‌లుగా చేసిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

వాడు నావాడే.. కాదు నావాడే, బాయ్ ఫ్రెండ్ కోసం కాలేజీలో కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు, అనకాపల్లిలో ఘటన, సోషల్ మీడియాలో వీడియో వైరల్

కాగా గత రాత్రి అనుమానాస్పదంగా కనిపించకుండా పోయాడంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు బుధవారం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ సందర్భంగా, బాధితుడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అతను మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో జాసిదిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహిణి గ్రామంలో తన ఇంటి వెలుపల బాధితుడిని కలుసుకున్నాడని, అనంతరం కుమ్రాబాద్ స్టేషన్ రోడ్‌కు వెళ్లాడని, అక్కడ మరో స్నేహితుడు అవినాష్ (19) వారితో చేరాడని పోలీసులకు తెలిపాడు.

గదిలో ప్రియురాలితో లవర్.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె భర్త, భయంతో ఐదవ అంతస్తు నుండి కిందకు దూకిన ప్రియుడు, పరారీలో ప్రియురాలు, ఆమె భర్త, రాజస్థాన్ రాష్ట్రంలో ఘటన

నిందితులపై IPC సెక్షన్లు 302 (హత్య), 201 (నేరం యొక్క సాక్ష్యం అదృశ్యం కావడం), 120B (నేరపూరిత కుట్ర), 34 (సాధారణ ఉద్దేశ్యంతో పలువురు వ్యక్తులు చేసిన చర్యలు) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement