Malaysian Woman Rape Case: ఆ మాజీ మంత్రి నాపై అత్యాచారం చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన కోలీవుడ్ నటి, ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు, ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపిన మణికందన్‌

కోలీవుడ్‌ నటిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ని బెంగళూరులో అరెస్ట్‌ చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. మలేషియా పౌరసత్వం ఉన్న కోలీవుడ్‌ నటి చేసిన అత్యాచార ఆరోపణలతో ( Malaysian Woman Rape Case) మణికందన్ అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

M Manikandan (photo Credits: IANS)

Ex-AIADMK minister M Manikandan Arrested: కోలీవుడ్‌ నటిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ని బెంగళూరులో అరెస్ట్‌ చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. మలేషియా పౌరసత్వం ఉన్న కోలీవుడ్‌ నటి చేసిన అత్యాచార ఆరోపణలతో ( Malaysian Woman Rape Case) మణికందన్ అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని కోలీవుడ్ నటి మాజీ మంత్రి మణికందన్‌పై (Ex-AIADMK minister M Manikandan) చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

కాగా ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత మణికందన్‌ పరారీలో ఉన్నాడు తాజాగా ఆయనను (Former Tamil Nadu Minister M Manikandan arrested) అదుపులోకి తీసుకున్నారు. ‘మణికందన్‌ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదేళ్ల పాటు తనతో సహజీవనం చేశాడు. తాను గర్భం దాల్చగా దానిని తొలగించమని బలవంతం చేశాడు. అలా మూడుసార్లు గర్భాన్ని తీయించుకున్నాను. తాను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్న సంగతి విదితమే. తన కుటుంబంపైనా హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. మణికంఠన్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని..ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె కోరారు.

అయిదుగురి భార్యలతో..,అయినా ఆరవ పెళ్లి కోసం సిద్ధపడుతుండగా పోలీసులకు ఫిర్యాదు చేసిన 5వ భార్య, ఆశ్రమానికి వచ్చే మహిళలను వదలని దొంగ బాబా అనూజ్‌ చేతన్‌ కథేరియా

కోలీవుడ్ నటి ఫిర్యాదుపై మాజీ మంత్రి మణికంఠన్‌ స్పందించారు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చాలా మంది తనను కలిశారన్నారు. అదే విధంగా ఆ నటి కూడా తనను కలిసి ఉండొచ్చని తెలిపారు. అప్పుడు తనతో తీసుకున్న ఫొటోలు చూపించి తప్పుడు ఫిర్యాదు చేసిందన్నారు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులే ఆ నటిని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనిచేయిస్తున్నారని అన్నారు.

మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్‌ చేసి ఆ నటితో కలిసున్న ఫొటోలు తమ వద్ద ఉన్నాయని.. ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారన్నారు. అందుకు తాను అంగీకరించలేదన్నారు. ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మణికందన్​తో జరిగినట్లుగా వాట్సాప్​ ఛాటింగ్​లను నటి మీడియాకు చూపించి పోలీసులకు సమర్పించింది.

కండోమ్‌లు ఇస్తాం, అయితే వాడకుండా ఇంటికి తీసుకువెళ్లండి, ఒలంపిక్స్ గేమ్స్‌లో సోషల్‌ డిస్టెన్స్‌ కఠినంగా అమలయ్యేలా చూస్తామని తెలిపిన కమిటీ సీఈవో తోషిరో ముటో

కాగా, 36 ఏళ్ల చాందినికి మలేషియా పౌరసత్వం ఉంది. ‘నడడిగల్​, వాగి సూడా వా’ లాంటి సినిమాల్లో ఆమె నటించింది. ఇక మణికందన్​ గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేశారు. జయలలితకు ఆప్తుడిగా పేరున్న 41 ఏళ్ల మణికందన్​.. అప్పటి మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్​పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పళనిస్వామికి వ్యతిరేకంగా టీవీవీ దినకరన్​ వేరు కుంపటిలో చేరి మంత్రి పదవిని పొగొట్టుకున్నాడు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement