Uttar Pradesh Shocker: భార్యపై అనుమానం, వెంటాడి తుపాకీతో కాల్చి చంపిన తాగుబోతు భర్త, బెయిల్ పై బయటకు తీసుకొచ్చిన ఇల్లాలిపై కనికరం చూపని కసాయి

పక్షం రోజుల క్రితం ఓ భర్త జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత తరువాత తన భార్యను కాల్చి చంపాడు. విచిత్రమేమిటంటే జైలుకు వెళ్లిన భర్తను కాళ్లరిగేలా తిరిగి బెయిల్ పై బయటకు తీసుకువచ్చిందా భార్య.ఆ కనికరం కూడా లేకుండా కాల్చి చంపాడు

Representational Image | (Photo Credits: IANS)

Bareilly, June 12: పక్షం రోజుల క్రితం ఓ భర్త జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత తరువాత తన భార్యను కాల్చి చంపాడు. విచిత్రమేమిటంటే జైలుకు వెళ్లిన భర్తను కాళ్లరిగేలా తిరిగి బెయిల్ పై బయటకు తీసుకువచ్చిందా భార్య.ఆ కనికరం కూడా లేకుండా కాల్చి చంపాడు. తన భార్య తనను మోసం చేసిందని నిందితుడు అనుమానించాడు. నిందితుడు కృష్ణపాల్ లోధి తన భార్య పూజలోకి అనేక బుల్లెట్లను దింపాడు.

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె 30 ఏళ్ల స్నేహితురాలు మున్నాపై కూడా కాల్చాడు. పోలీసులు పూజా మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు.ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఈ దారుణం జరిగింది.తల్లి మరణించడం, తండ్రి జైలుకు వెళ్లడంతో పిల్లలు ఇద్దరూ అనాథలుగా మారారు. కాగా పోలీసు విచారణలో తన భార్య తనను మోసం చేసిందని, అందుకే చంపేశానని ఆ భర్త వెల్లడించాడు.

ఫ్యాషన్‌ షోలో ర్యాంప్ వాక్ చేస్తుండగా మీద పడిన స్థంభం, అక్కడికక్కడే మృతి చెందిన నోయిడా మోడల్

సీనియర్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణపాల్ తన భార్య తనను మోసం చేసిందని అనుమానించి, ఆమెను కాల్చిచంపినట్లు పోలీసులకు తెలిపాడు. "ఆమె చనిపోవడానికి అర్హురాలు, అందుకే నేను ఆమెను చంపాను, నాకు ఎటువంటి విచారం లేదు," అని అతను చెప్పాడు.బరేలీకి చెందిన కృష్ణపాల్ లోధి, పూజ ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో 2012లో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. లోధీకి సరైన ఉద్యోగం దొరకకపోవడంతో పూజ ఓ బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. చిన్నచితకా పనులు చేస్తూ లోధీ కాలం గడుపుతున్నాడు. ఇటీవలి కాలంలో భార్యపై అనుమానం పెంచుకున్న లోధీ తరచూ ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ కేసులో లోధీ జైలుపాలయ్యాడు.

రైల్వే లైన్ తగలడంతో కరెంట్ షాక్, మాడి మసైపోయిన క్లీనింగ్ కార్మికుడు, జాగ్రత్తగా లేకుంటే అంతే..షాకింగ్ వీడియో ఇదిగో..

పూజ లాయర్ల చుట్టూ తిరిగి బెయిల్ పై లోధీని బయటకు తీసుకువచ్చింది. పదిహేను రోజుల క్రితమే బయటకు వచ్చిన లోధీ.. శనివారం సాయంత్రం భార్యతో గొడవ పెట్టుకుని కోపం పట్టలేక నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. వరుసగా బుల్లెట్లు దిగడంతో పూజ అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత పూజ స్నేహితుడు మున్నాపైనా లోధీ కాల్పులు జరిపాడు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని లోధీని అదుపులోకి తీసుకున్నారు. హత్య, హత్యాయత్నం కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపించారు. కాగా, కాల్పుల్లో గాయపడ్డ మున్నా ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.

పూజ తల్లి షీలాదేవి మాట్లాడుతూ.. కృష్ణపాల్‌ మద్యానికి బానిసై రోజూ రాత్రి నా కూతురిని కొట్టేవాడు. శనివారం క్రిష్ణపాల్‌ మద్యం మత్తులో ఇంటికి వచ్చి మైనర్‌ కొడుకుల ముందే పూజపై దూషించాడని వాపోయారు. అతను కోపోద్రిక్తుడైనాడు, కంట్రీ మేడ్ పిస్టల్ తీసుకున్నాడు. పూజ భయాందోళనకు గురై ఇంటి నుండి బయటకు పరుగెత్తింది. కానీ అతను ఆమెను వెంబడించి కాల్చి చంపాడని తెలిపింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now