Manchu Family Conflict: తనపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్, దర్యాప్తు చేస్తామని తెలిపిన పహాడీ షరీఫ్ పోలీసులు

హీరో మంచు మనోజ్ నిన్న తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారి వివరాలను హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో అందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని మనోజ్ కోరారు. కాగా, దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ మీడియాతో మాట్లాడారు.

manchu-manoj-complainst-to-police on attack Here are Details

హీరో మంచు మనోజ్ నిన్న తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారి వివరాలను హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో అందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని మనోజ్ కోరారు. కాగా, దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ ఇన్ స్పెక్టర్ మీడియాతో మాట్లాడారు.

"మంచు మనోజ్ నిన్న తన భార్యా పిల్లలతో ఇంట్లో ఉండగా, పది మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని తాను పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు పారిపోయారని... ఈ క్రమంలో తనకు దెబ్బలు తగిలాయని మంచు మనోజ్ చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత తాను ఆసుపత్రికి వెళ్లానని, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజి లేకుండా చేశారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మంచు మనోజ్ మాకు ఫిర్యాదు చేశారు. దీనిపై మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాం" అని పోలీస్ ఇన్ స్పెక్టర్ వెల్లడించారు.

వీడియోలు ఇవిగో, మంచు మనోజ్ ఇంటి వద్ద ఉద్రిక్తత, భారీగా తన బౌన్సర్‌లను మోహరించిన విష్ణు

మంచు మనోజ్ తన ఫిర్యాదులో ఎవరి పేర్లు ప్రస్తావించలేదని, 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు అని మాత్రమే పేర్కొన్నారని పోలీస్ ఇన్ స్పెక్టర్ స్పష్టం చేశారు. ఆ కంప్లెయింట్ లో మోహన్ బాబు పేరు గానీ, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు గానీ లేవని తెలిపారు. ఈ దాడి ఎందుకు జరిగిందనేది తనకు తెలియదని మంచు మనోజ్ అంటున్నారని... తనకు, తన భార్యకు, పిల్లలకు ముప్పు ఉందని మాత్రం చెబుతున్నారని ఇన్ స్పెక్టర్ వివరించారు. దర్యాప్తులో ఇతర అంశాలు తెలుస్తాయని అన్నారు.

డయల్ 100కి కాల్ వచ్చిన తర్వాత మంచు మనోజ్ నివాసానికి పోలీసులు వెళ్లారని, తాము వెళ్లే సరికి అక్కడ మంచు మనోజ్, ఆయన భార్యా పిల్లలు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటన నిన్న ఉదయం 9 గంటలకు జరిగిందని మనోజ్ చెప్పారని ఇన్ స్పెక్టర్ పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజి మాయం కావడంపై దర్యాప్తులో తేలుతుందన్నారు. విజయ్ రెడ్డి, కిరణ్ అనే వ్యక్తులు సీసీటీవీ ఫుటేజి మాయం చేసినట్టు మనోజ్ ఆరోపించారని వివరించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

US Begins Deportation of Indian Migrants: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా, భారతీయులను వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం, దాదాపు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా వార్తలు

SC on Maha Kumbh 2025 Stampede: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు, దురదృష్టకరమంటూ పిల్‌ను తిరస్కరించిన అత్యున్నత ధర్మాసనం

Fire On Panakala Swamy Hill: మంగళగిరి కొండపై మంటలు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఘోరం.. వ్యాపించిన దావానలం.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్న ప్రజలు.. అనూహ్యంగా వాటంతట అవే ఆరిపోయిన మంటలు.. పానకాల స్వామి మహిమేనంటున్న భక్తులు (వీడియో)

Attack On Patient Relatives: రోగి బంధువులపై ఆసుపత్రి సిబ్బంది దాడి.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఘటన.. అసలేం జరిగింది? (వీడియో)

Share Now