Tablighi Jamaat Row: తబ్లిఘి జమాత్కు హాజరైన విదేశీయుల వీసాల రద్దుతో పాటు బ్లాక్లిస్ట్ చేసిన కేంద్ర హోంశాఖ, నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ
మర్కజ్లో కరోనావైరస్ లక్షణాలు కలిగి ఉండి కూడా మతపరమైన సమ్మేళనంకు హాజరైన సుమారు 1,300 మంది అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన విదేశీ తబ్లిఘి జమాత్ కార్యకర్తలు ఆ సమ్మేళనంలో పాల్గొనడమే కాకుండా.....
- Read in
- English
New Delhi, April 3: నిబంధనలు ఉల్లంఘించి నిజాముద్దీన్ (Nizamuddin) తబ్లిఘి జమాత్ (Tablighi Jamaat) సమ్మేళనంలో పాల్గొన్న 960 మంది విదేశీయుల వీసాలను రద్దు (Visa Cancel) చేయడంతో పాటు వారిని బ్లాక్ లిస్ట్ (blacklist) లో చేర్చింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA). అంతేకాకుండా ఈ రకంగా నిబంధనలు అతిక్రమించి పట్టుబడిన విదేశీయులందరిపై విదేశీయుల చట్టం 1946 మరియు విపత్తు నిర్వహణ చట్టం 2005 ( Disaster Management Act, 2005.) లోని సెక్షన్ల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దిల్లీ కమీషనర్కు అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత కమీషనరేట్లకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
సౌత్ దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్లో కరోనావైరస్ లక్షణాలు కలిగి ఉండి కూడా మతపరమైన సమ్మేళనంకు హాజరైన సుమారు 1,300 మంది అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన విదేశీ తబ్లిఘి జమాత్ కార్యకర్తలు ఆ సమ్మేళనంలో పాల్గొనడమే కాకుండా ఆ తదనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ఈ ఒక్క చర్యనే ఇప్పుడు భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తికి కారణమైంది.
Here's the update by ANI
నిజాముద్దీన్ వెస్ట్లోని తబ్లిఘి జమాత్ నిర్వహించిన మర్కజ్ సెంటర్ ఇప్పుడు దేశంలో కరోనావైరస్ యొక్క హాట్స్పాట్గా అవతరించింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. దిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి సమావేశం నిర్వహించినందుకు దాని మతాధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం, అతిక్రమించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష
ఈ ఒక్క కేంద్రం నుండి మొదలైన కరోనావైరస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సుమారు 20 రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించబడింది. మర్కజ్ తో సంబంధం ఉన్న సుమారు 9,000 మంది భారతీయ తబ్లిఘి జమాత్ సభ్యులను మరియు వారి సన్నిహితులను ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారిక బృందాలు గుర్తించి వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నమోదవుతున్న కేసులు మరియు ఇప్పటివరకు నమోదైన 12 కరోనా మరణాలు మొత్తం ఈ సమావేశంతో లింక్ ఉన్నవే అని తేలింది.
Tags
సంబంధిత వార్తలు
North India Heatwave: ఉడికిపోతున్న ఉత్తర భారత్, ఢిల్లీలో 50 డిగ్రీలకు చేరిన టెంపరేచర్స్, రాజస్థాన్ లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు
WHO on COVID: కరోనా కారణంగా తగ్గిన మనిషి ఆయుష్షు కాలం, ఏకంగా 1.8 సంవత్సరాలు తగ్గి 71.4 ఏళ్లకు చేరిందని తెలిపిన డబ్ల్యూహెచ్వో
Bomb Threat To Home Ministry: కేంద్ర హోంశాఖను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్, అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, ఫేక్ అని నిర్థారణ
Covishield Side Effects: కోవిషీల్డ్ టీకాతో ప్రాణాంతక వీఐటీటీ, అరుదైన ప్రాణాంతక రుగ్మతకు దారితీస్తున్న వ్యాక్సిన్, ఆస్ట్రేలియా పరిశోధనలో మరిన్ని కొత్త విషయాలు
Covaxin Side Effects: కొవాగ్జిన్ టీకా తీసుకున్న మహిళల్లో పడిపోతున్న ప్లేట్లెట్లు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి, కౌమారదశలో ఉన్న మహిళలకు ఏఈఎస్ఐ ముప్పు
What is FLiRT? కొత్త కోవిడ్ FLiRT వేరియంట్ లక్షణాలు, చికిత్స మార్గాలు ఇవిగో, భారత్లో పెరుగుతున్న కొత్త కరోనా వేరియంట్ కేసులు
New COVID-19 Variant ‘FLiRT’: భారత్లో కొత్త కరోనా వేరియంట్ FLiRT కలకలం, ఇప్పటివరకు దేశంలో 250 కేసులు నమోదు, కోవిడ్-19 వేరియంట్ ఆందోళనపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
Covishield Caused Deaths? కోవిషీల్డ్ కారణంగా తమ పిల్లలు చనిపోయారంటూ కోర్టు గడపతొక్కిన తల్లిదండ్రులు, రక్తం గడ్డకట్టే ప్రమాదకర స్థితికి వ్యాక్సిన్ కారణమైందని వెల్లడి
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Telangana Capital Hyderabad: హైదరాబాద్ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్తో అలరించిన గూగుల్
Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ
Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ