New COVID-19 Strain: కొత్త కరోనావైరస్ టెన్సన్, యుకె నుంచి వచ్చే వారి కోసం కొత్త గైడ్ లెన్స్ విడుదల చేసిన కేంద్రం, కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి

దేశంలో కొత్త కరోనావైరస్ మెల్లిగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 29 కొత్త కరోనా కేసులు (New COVID-19 Strain) నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కొత్త స్ట్రెయిన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనవరి 7 వరకు బ్రిటన్‌ (Britan) నుంచి వచ్చే విమాన సర్వీసులపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Flights- Representational Image | (Photo Credits: Pixabay)

New Delhi, Jan 2: దేశంలో కొత్త కరోనావైరస్ మెల్లిగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 29 కొత్త కరోనా కేసులు (New COVID-19 Strain) నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కొత్త స్ట్రెయిన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనవరి 7 వరకు బ్రిటన్‌ (Britan) నుంచి వచ్చే విమాన సర్వీసులపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే జనవరి 8 నుంచి మళ్లీ విమాన సర్వీసులను నడిపేందుకు భారత్‌ (India) సిద్ధమైంది. ఈ మేరకు పౌర విమానయాన మంత్రి హర్దిప్‌పూరి శుక్రవారం వెల్లడించారు. ఈ క్రమంలో యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్ర ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు యూకే (UK) రిటర్న్స్‌ కోసం నిర్దేశిత మార్గర్శకాలను(సాప్స్‌) (Standard Operating Procedure (SOPs) విడుదల చేసింది.

బ్రిటన్‌ నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణీకులందరికి కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేసింది.. సంబంధిత టెస్ట్‌లకు అయ్యే ఖర్చులు కూడా ఆ ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రయాణీకులను విమానంలోకి అనుమతించే ముందు విమానయాన సంస్థలు కరోనా వైరస్ నెగటివ్ టెస్ట్ రిపోర్టును నిర్ధారించాలని, యూకే నుంచి వచ్చే ప్రయాణీకులందరూ భారత విమానాశ్రయాలకు చేరగానే తప్పనిసరిగా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఎస్ఓపీలో పేర్కొంది.

అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్, తొలి విడతలో మూడు కోట్ల మందికి మాత్ర‌మే ఉచిత టీకా, వ్యాక్సినేషన్ డ్రై రన్ తీరును సమీక్షించిన కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్

కరోనా నెగిటివ్‌ వచ్చినవారు ఇండియాకు రాగానే ఆయా రాష్ట్రాల్లో 14రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జనవరి 30 వరకు అమల్లో ఉంటాయి. యూకే నుంచి వచ్చే వారందరూ 72 గంటల ముందు ఆన్‌లైన్‌ పోర్టల్‌ https://www.newdelhiairport.in/ లో కోవిడ్ టెస్ట్‌లో నెగెటివ్‌గా రిపోర్టు సమర్పించాలి. ప్రయాణికుడిని విమానంలోకి ఎక్కడానికి అనుమతించే ముందు విమానయాన సంస్థలు కోవిడ్ నెగిటివ్‌ రిపోర్ట్‌ను పరిశీలించాలి.

ఆర్టీపీసీఆర్‌ టెస్ట్ లేక, టెస్ట్ జరిగిన తర్వాత ఫలితం కోసం చూసేవారికోసం విమానాశ్రయంలో షెల్టర్, హెల్ప్‌ డెస్క్‌ కల్పించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.సదరు ప్రయాణికుడికి కోవిడ్ పాజిటివ్‌గా తేలితే ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉండే విధంగా చూడాలి. నెగెటివ్‌గా తేలేవరకూ ఐసోలేషన్‌లో ఉండాలి. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించిన.. అటూ ఇటూ మూడు వరసల్లో ఉన్న ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి.ఎయిర్‌పోర్ట్‌లో నెగెటివ్‌గా తేలిన వ్యక్తి అధికారుల పర్యవేక్షణలో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

Central University Students Protest: వీడియో ఇదిగో, సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం, విద్యార్థినుల బాత్రూం లోకి తొంగి చూసిన గుర్తు తెలియని వ్యక్తులు, అర్థరాత్రి ధర్నాకు దిగిన విద్యార్థినులు

8th Pay Commission: ఈ ఉద్యోగుల జీతం భారీగా పెరుగనుంది! 8వ వేతన సంఘం ప్రతిపాదనలు అమలైతే ఒక్కసారిగా ఎంత జీతం పెరుగుతుందంటే?

KTR: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే..యూజీసీ నిబంధనలపై కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి

Share Now