No Namaz Break for Muslim MLAs: ముస్లిం ఎమ్మెల్యేలకు ఆ రోజు నో నమాజ్, శుక్రవారం నమాజ్‌ విరామం రద్దు చేస్తూ అస్సాం అసెంబ్లీ కీలక నిర్ణయం, సీఎం హిమంత బిస్వా శర్మ ఏమన్నారంటే..

ముస్లిం శాసనసభ్యులకు రెండు గంటల నమాజ్ విరామం ఇవ్వాలనే దశాబ్దాల నాటి నిబంధనలను రద్దు చేస్తూ అస్సాం అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రోజుల మాదిరిగానే శుక్రవారం కూడా సభను కొనసాగించాలని అసెంబ్లీ రూల్స్ కమిటీ ఈరోజు తీర్మానం చేసింది

Assam CM Himanta Biswa Sarma (Phoot-ANI)

గౌహతి, ఆగస్టు 30: ముస్లిం శాసనసభ్యులకు రెండు గంటల నమాజ్ విరామం ఇవ్వాలనే దశాబ్దాల నాటి నిబంధనలను రద్దు చేస్తూ అస్సాం అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రోజుల మాదిరిగానే శుక్రవారం కూడా సభను కొనసాగించాలని అసెంబ్లీ రూల్స్ కమిటీ ఈరోజు తీర్మానం చేసింది. ముస్లిం ఎమ్మెల్యేలు నమాజ్ ప్రార్థనలకు హాజరయ్యేందుకు వీలుగా నేటి వరకు అస్సాం అసెంబ్లీ శుక్రవారం రెండు గంటల పాటు వాయిదా పడింది.

అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ చర్య ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి.చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎవరూ దీనిని ప్రయత్నించలేదు, కానీ హిమంత బిస్వాస్ శర్మ కేవలం ముస్లింల మనోభావాలను దెబ్బతీయడానికి మరియు హిందువులు మరియు ముస్లింల మధ్య విభజనను సృష్టించడానికి ఇలా చేస్తున్నారు" అని అధికార పార్టీకి చెందిన ముజిబుర్ రెహ్మాన్ ఆరోపించారు.  మలుపులు తిరుగుతున్న జార్ఖండ్‌ రాజకీయాలు, బీజేపీ గూటికి చేరిన మాజీ సీఎం చంపై సోరెన్‌, గిరిజనులకు బాసటగా నిలుస్తామని స్పష్టం

కాంగ్రెస్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ సిక్దర్ మాట్లాడుతూ, "ఇది దశాబ్దాలుగా సభ అనుసరిస్తున్న సంప్రదాయం మరియు ధోరణి, వారు దీనిని మార్చాలని నిర్ణయించుకున్నారు, అయితే విస్తృత సంప్రదింపులు జరిగాయి? ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వారు వివరించాలని తెలిపారు. బిజెపి ఎమ్మెల్యే తరంగ గొగోయ్ ఈ చర్యను స్వాగతించారు మరియు ఒక వర్గానికి ప్రత్యేక నిబంధనలు ఉండకూడదని అన్నారు.ఇది సెక్యులర్ దేశం మరియు అసెంబ్లీ లోపల, ఒక కమ్యూనిటీకి ప్రత్యేక నిబంధనలు ఉండకూడదు కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. వారు నమాజ్ చేయవలసి వస్తే వారికి విమానాశ్రయాలలో వంటి ప్రత్యేక గది ఉంటుంది. వారికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండవు. శుక్రవారం సభను రెండు గంటల పాటు వాయిదా వేసేవారని తెలిపారు.

Here's Himanta Biswa Sarma Tweet

కాగా ముస్లిం ఎమ్మెల్యేలు ప్రార్థనలకు హాజరయ్యేందుకు వీలుగా ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం అస్సాం అసెంబ్లీ రెండు గంటలు వాయిదా పడేది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సభను వాయిదా వేసేవారు. ముస్లిం సభ్యుల నమాజ్ అనంతరం లంచ్ సెషన్‌ తర్వాత అసెంబ్లీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేవి. మతపరమైన ప్రయోజనాల కోసం ఎలాంటి వాయిదా లేకుండా ఇతర రోజుల మాదిరిగానే శుక్రవారం రోజు కూడా సభా కార్యకలాపాలు కొనసాగడంపై స్పీకర్ బిస్వజిత్ డైమరీ దృష్టి సారించినట్లు అస్సాం అసెంబ్లీ కార్యాలయం పేర్కొంది. రాజ్యాంగంలోని లౌకిక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారాల్లో ఏ విధమైన వాయిదా లేకుండా అస్సాం అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించాలని స్పీకర్‌ ప్రతిపాదించినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఈ నిర్ణయంపై స్పందించారు. ముస్లిం ఎమ్మెల్యేల నమాజ్ కోసం రెండు గంటల విరామాన్ని తొలగించడం ద్వారా అస్సాం అసెంబ్లీ ఉత్పాదకతకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. అలాగే వలస పాలనకు సంబంధించిన మరో చిహ్నం తొలగిందని అన్నారు. 1937లో ముస్లిం లీగ్‌కు చెందిన సయ్యద్ సాదుల్లా ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement