Odisha Shocker: తాబేలు కూర మాడ్చిందని భార్యను దారుణంగా చంపేసి ఇంటివెనక పూడ్చిపెట్టిన తాగుబోతు భర్త, పారిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు, ఒడిశాలో దారుణ ఘటన

ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఒక తాగుబోతు వ్యక్తి తన భార్యను చంపి (Drunk Man Kills Wife), ఆమె మృతదేహాన్ని తన ఇంటి పెరటిలో పూడ్చిపెట్టాడు, వంట చేస్తున్నప్పుడు తాబేలు కూర మాడిపోయేలా కాల్చినందుకు (Slightly Burnt Turtle Curry) ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Representative Image Murder ( Photo Credits : Pixabay

Sambalpur, Oct 22: ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఒక తాగుబోతు వ్యక్తి తన భార్యను చంపి (Drunk Man Kills Wife), ఆమె మృతదేహాన్ని తన ఇంటి పెరటిలో పూడ్చిపెట్టాడు, వంట చేస్తున్నప్పుడు తాబేలు కూర మాడిపోయేలా కాల్చినందుకు (Slightly Burnt Turtle Curry) ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.కోపంతో ఆ తాగుబోతు భర్త ఆమెను చంపేసి ఇంటి వెనక పూడ్చి (Buries Body In Backyard) పెట్టాడు. 35 ఏళ్ల మహిళ మృతదేహాన్ని గురువారం పోలీసులు వెలికితీశారు, ఆమె భర్త ఒక నెల కంటే ఎక్కువ కాలం క్రితం నా భార్య తప్పిపోయిందని మొదట పేర్కొన్న తర్వాత..పోలీసుల దెబ్బతగలడంతో నేరం అంగీకరించాడు.

స్థానిక పోలీసుల కథనం ప్రకారం, సంబల్‌పూర్ నగరానికి నైరుతి దిశలో 166 కిలోమీటర్ల దూరంలోని బద్మల్ పంచాయతీలోని రౌత్‌పరా గ్రామంలోని రంజన్ బాడింగ్ (36) దాదాపు నెల రోజుల క్రితం నేరం జరిగిన రోజున తన ఇంటికి తాబేలును అక్రమంగా తీసుకువచ్చాడు.ఆ తర్వాత అతను తన భార్య సాబిత్రిని వండమని అడిగాడు, అయితే కూర వండేటప్పుడు కొద్దిగా కాలిపోయింది, ఇది వాగ్వాదానికి దారితీసింది.

రక్తం కారి ఏడుస్తున్నా వదలిన కామాంధులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను పొదల్లోకి లాక్కెళ్లి 10 మంది దారుణంగా అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన జార్ఖండ్ పోలీసులు

భర్త తన భార్యను తీవ్రంగా కొట్టి, ఆమె అపస్మారక స్థితిలో పడిపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తరువాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతను ఆమె చనిపోయినట్లు కనుగొన్నాడు. తదనంతరం, అతను మృతదేహాన్ని ఇంటి పెరట్లో పూడ్చిపెట్టాడు. సాబిత్రి కోపంతో ఇంటం నుంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడని జామన్కిరా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్‌జిత్ దాస్ తెలిపారు.

తన కుమార్తె అదృశ్యంపై మహిళ తల్లి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు గ్రామానికి వెళ్లి అతని భార్య గురించి అడగ్గా, అతను సంఘటన స్థలం నుండి పారిపోయాడు. ఆ వ్యక్తిని పోలీసు బృందం, గ్రామస్థులు పట్టుకోగా, అతను నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now