Odisha Shocker: బర్త్‌డే పార్టీలో సౌండ్ ఆపమన్నందుకు మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం, రూంలోకి లాక్కెళ్లి ఒకరి తర్వాత ఒకరు వంతులు వారీగా గ్యాంగ్ రేప్, ఒడిశాలో దారుణ ఘటన

భువనేశ్వర్‌లో పుట్టినరోజు వేడుకల్లో సౌండ్ వస్తుందని అభ్యంతరం చెప్పినందుకు (Objecting to Noise During Birthday Party ) ఓ మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి (Woman Gang-Raped)పాల్పడ్డారు.

Odisha Shocker: బర్త్‌డే పార్టీలో సౌండ్ ఆపమన్నందుకు మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం, రూంలోకి లాక్కెళ్లి ఒకరి తర్వాత ఒకరు వంతులు వారీగా గ్యాంగ్ రేప్, ఒడిశాలో దారుణ ఘటన
Man thrashes wife for failing to conceive a child (Representational: Getty)

Bhubaneswar, Dec 14: భువనేశ్వర్‌లో పుట్టినరోజు వేడుకల్లో సౌండ్ వస్తుందని అభ్యంతరం చెప్పినందుకు (Objecting to Noise During Birthday Party ) ఓ మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి (Woman Gang-Raped)పాల్పడ్డారు.

డిసెంబరు 11 (ఆదివారం) మంచేశ్వర్ పోలీసు పరిధిలో జరిగిన ఈ సంఘటన సోమవారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. సోమవారం మంచేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు (Three Arrested) చేసినట్లు కళింగటివి నివేదించింది.

ముసలోడు కాదు కామాంధుడు, జ్యూస్ ఇస్తా రమ్మంటూ బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లాడు, మత్తు మందు ఇచ్చి సాయంత్రం వరకు దారుణంగా రేప్, విషయం తెలిసి అతన్ని కొట్టి చంపిన బాలిక తల్లిదండ్రులు

నిందితులను దేబాషిస్ ప్రధాన్ (24), దీపక్ కుమార్ సేథీ (24), స్వాధీన్ కుమార్ నాయక్ (22)లుగా గుర్తించారు. డిసెంబర్ 11 సాయంత్రం దీపక్ తన పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పార్టీలొ పెద్ద సౌండ్ తో డీజే ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో నివసించే వారు అభ్యంతరం తెలిపారు. అయితే, ఫిర్యాదుపై ఆగ్రహించిన నిందితులు ముగ్గురూ మహిళను ఓ ఇంట్లోకి లాగి వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు.

మియాపూర్‌లో మరో దారుణం, మాట్లాడటం లేదని ప్రియురాలిని కత్తితో పొడిచిన యువకుడు, అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం

ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడు. బాధితురాలు సహాయం కోసం కేకలు వేయడంతో కొందరు ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని నిందితుల బారి నుంచి ఆమెను రక్షించారు. అయితే, అక్కడి నుంచి వెళ్లే ముందు నిందితులు ముగ్గురూ బాధితురాలిని చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం. బాధితురాలు, ఆమె భర్త నిందితులు మరియు వారి సహచరులు కొందరిపై మంచేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఫిర్యాదు మేరకు ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

Uttar Pradesh: ఇంత దారుణమా, నడిరోడ్డు మీద వృద్ధ దంపతులను ఇష్టం వచ్చినట్లుగా తన్నుతూ కొట్టిన ఓ వ్యక్తి, ఆపకుండా చోద్యం చూసిన స్థానికులు

SLBC Tunnel Collapse Update: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం, బిగ్గరగా అరిచినా 8 మంది నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు

Andhra Pradesh Assembly Session 2025: అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో మాట్లాడలేం, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి

Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు

Share Us