INS Vikrant: భారత అమ్ములపొదిలోకి బాహుబలి యుద్ధనౌక, పూర్తిగా భారత్‌లోనే తయారైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ నౌకను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ, బాహుబలి యుద్ధనౌక ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు!

కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటన కొనసాగుతోంది. కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను (INS Vikrant) ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం చేశారు. కాగా ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది.

INS Vikrant: భారత అమ్ములపొదిలోకి బాహుబలి యుద్ధనౌక, పూర్తిగా భారత్‌లోనే తయారైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ నౌకను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ, బాహుబలి యుద్ధనౌక ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు!
INS VIKRANT (Photo Credit- PTI)

Cochin, SEP 02: కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటన కొనసాగుతోంది. కొచ్చిలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను (INS Vikrant) ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం చేశారు. కాగా ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నౌక (INS Vikrant) గంటలకు 28 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది.దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టింది. 262 మీటర్ల పొడవు,. 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి.  విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు.

కాగా ఇప్పటిదాకా భారత్‌ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను (INS Vikrant) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ విజయవంతంగా నిర్మించింది.

Starbucks New CEO: మరో గ్లోబల్‌ కంపెనీకి సీఈవోగా భారతీయుడు, స్టార్‌ బక్స్‌ కాఫీచైన్‌ బాధ్యతలు చూసుకోనున్న లక్ష్మణ్ నరసింహన్, త్వరలోనే పూర్తిస్థాయి భాధ్యతలు, లక్ష్మణ్ నరసింహన్ పూర్తి వివరాలివి! 

ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించనున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

India Win by 6 Wickets: చివరి ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు పడటడంతో టెన్షన్ టెన్షన్, పాకిస్థాన్‌పై టీమిండియా గ్రాండ్‌ విక్టరీ, సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ

SLBC Tunnel Rescue Operation: ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో బాధితులు బతికే అవకాశం లేదు, లోపల పరిస్థితి దారుణంగా ఉందన్న మంత్రి జూపల్లి, వందలాది మందితో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Virat Kohli World Record: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వరల్డ్‌ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని పరుగుల రికార్డు సొంతం

Wine Shops Will Close In Telangana: మందుబాబులు అలర్ట్‌, తెలంగాణలో ఆ రోజు వైన్‌షాప్స్‌ బంద్‌

Share Us