Rahul Gandhi as Mechanic: మెకానిక్‌గా మారిన రాహుల్‌ గాంధీ, ఢిల్లీ వీధుల్లో బైక్‌ రిపేర్‌ చేసిన రాహుల్, మెకానిక్‌ల కష్టాలను తెలుసుకున్న కాంగ్రెస్‌ నేత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) బైక్‌ మెకానిక్‌గా మారారు. పానా, స్క్రూడ్రైవర్‌ చేతపట్టి బైక్‌ను ఎలా బాగుచేయాలో తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని (Delhi) కరోల్‌ బాగ్‌ (Karol Bagh) సైకిల్‌ మార్కెట్‌లోని ఓ బైక్‌ రిపేర్‌ షాపునకు రాహుల్‌ వెళ్లారు.

Rahul Gandhi as Mechanic (PIC@ ANI Twitter)

New Delhi, June 28: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) బైక్‌ మెకానిక్‌గా మారారు. పానా, స్క్రూడ్రైవర్‌ చేతపట్టి బైక్‌ను ఎలా బాగుచేయాలో తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని (Delhi) కరోల్‌ బాగ్‌ (Karol Bagh) సైకిల్‌ మార్కెట్‌లోని ఓ బైక్‌ రిపేర్‌ షాపునకు రాహుల్‌ వెళ్లారు. ఈసందర్భంగా మోటారు సైకిళ్లను ఎలా రిపేర్‌ చేయాలో మెకానిక్‌లను అడిగి తెలుసుకున్నారు. వారితో ఇంటరాక్ట్‌ అయ్యారు. దీంతోపాటు సైకిల్‌ మార్కెట్‌లోని వ్యాపారులు (Cycle traders), కార్మికులు, బైక్‌ మెకానిక్‌లతో (Bike mechanics) మాట్లాడారు. ఈ చేతులే భారత్‌ను నిర్మిస్తాయని రాహూల్‌ అన్నారు.

ఈ బట్టలపై ఉన్న మసి మన గర్వానికి నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. అలాంటి చేతులతో దృఢంగా నిలబడి వారిని ప్రోత్సహించే పని కేవలం ప్రజా నాయకుడు మాత్రమే చేస్తాడని పేర్కొంది. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో రాహుల్‌ బైక్‌ మెకానిక్‌లకు అండగా ఉన్నాడని స్పష్టం చేసింది. కనెక్ట్‌ ఇండియా ప్రయాణం కొనసాగుతుందని పేర్కొంది. కాగా, ఇటీవల రాత్రి సమయంలో ఓ ట్రక్కులో వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ల కష్ట నష్టాలను గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement
Advertisement
Share Now
Advertisement