Rajya Sabha Elections 2023: మొత్తం 10 స్థానాలకు జూలై 24న రాజ్యసభకు ఎన్నికలు, పశ్చిమ బెంగాల్‌, గోవా, గుజరాత్‌ నుంచి 10 స్థానాలు ఖాళీ

కేంద్రమంత్రి ఎస్‌ జైశంకర్‌ సహా పది మంది సభ్యుల పదవీకాలం పూర్తవనుండటంతో జూలై 24న రాజ్యసభకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం షెడ్యూల్‌ ప్రకటించింది

Election Commission of India. (Photo Credit: Twitter)

కేంద్రమంత్రి ఎస్‌ జైశంకర్‌ సహా పది మంది సభ్యుల పదవీకాలం పూర్తవనుండటంతో జూలై 24న రాజ్యసభకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ ఏడాది జులై – ఆగస్ట్‌ మధ్య పశ్చిమ బెంగాల్‌, గోవా, గుజరాత్‌ నుంచి ఈ 10 స్థానాలు ఖాళీ అవుతున్నట్లు పేర్కొంది.

అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక స్థానం ఖాళీ కానుంది. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ జులై 6న విడుదలవుతుందని తెలిపింది. జూలై 13 వరకు నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణకు జులై 17న చివరి తేదీగా పేర్కొంది. 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చట్లు, వీడియో ఇదిగో..

గత ఏడాది జులైలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మూడు స్థానాలను నిలబెట్టుకోగా, రాజస్థాన్‌, మహారాష్ట్రల్లో ఒక్కో స్థానంలో గెలుపొందింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు

Telangana Teacher's MLC Elections: ఉపాధ్యాయ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్, నల్గొండ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుంచి మల్క కొమురయ్య విజయం

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Advertisement
Advertisement
Share Now
Advertisement