Ayodhya Ram Mandir Bhumi Pujan: అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, అయోధ్యలో పారిజాత మొక్కను నాటిన నమో, నరేంద్ర మోదీ అయోధ్య పర్యటన పూర్తి సమాచారం లోపల కథనంలో..
రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి (Ayodhya Ram Mandir Bhumi Pujan) విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి పునాది రాయిని (PM Narendra Modi Lays Foundation Stone) వేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన శంకుస్థాపన క్రతువు నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామానంద్ ట్రస్ట్ అధ్యక్షుడు, హిందూమత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భూమిపూజ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది.
Ayodhya, August 5: అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి (Ayodhya Ram Mandir Bhumi Pujan) విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి పునాది రాయిని (PM Narendra Modi Lays Foundation Stone) వేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన శంకుస్థాపన క్రతువు నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామానంద్ ట్రస్ట్ అధ్యక్షుడు, హిందూమత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భూమిపూజ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. రామ నామ స్మరణతో అయోధ్య మార్మోగుతోంది. రఘురాముడు నడయాడిన అయోధ్య వైపే అందరి చూపు
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం చేశారు. అనంతరం మోదీ అక్కడ పారిజాత మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని పక్కన ఉన్నారు.
ముందుగా రామ్లల్లా ఆలయానికి చేరుకున్న మోదీ తొలుత సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆయన శ్రీరాముడికి పువ్వులతో పూజ సమర్పించారు. రామాలయ నిర్మాణం సందర్భంగా భూమిపూజలో పాల్గొనేందుకు మోదీ అయోధ్యకు చేరుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రామ్లల్లా విగ్రహమూర్తి చుట్టూ మోదీ ప్రదక్షిణలు చేశారు.
PM Narendra Modi Lays Foundation Stone For Ram Mandir in Ayodhya:
ప్రధానితో పాటు మొత్తం 17 మంది స్టేజ్పై పూజలో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా భూమిపూజలో పాల్గొన్నారు. మోదీ రాకకు పూర్వమే భూమిపూజ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పండితులు వేద మంత్రాలు చదువుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణేశుడు పూజ చేశారు. భూమి పూజ కోసం తొమ్మిది శిలలను వాడారు. జల, పుష్పాలతో మోదీ పూజించారు. మోదీ చేత సంకల్పం చదివించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పూజలో పాల్గొన్నారు. మోదీ పేరిట పండితులు పూజ నిర్వహించారు.
Update by ANI
అయోధ్యకు చేరగానే ప్రధాని ముందుగా హనుమాన్గఢీ ఆలయానికి వెళ్లి అక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానితోపాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు ప్రేమ్దాస్ మహరాజ్ ప్రధానికి తలపాగా, వెండి కిరీటం బహూకరించారు. అనంతరం ప్రధాని రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరిగే ప్రదేశానికి వెళ్లారు.
భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులంతా ఉదయాన్నే అయోధ్యకు చేరుకున్నారు. ఈ భూమిపూజ నేపథ్యంలో అయోధ్యలో పండుగవాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా రామనామ స్మరణతో అయోధ్యానగరం మార్మోగుతున్నది. ప్రధాని పర్యటన, భూమిపూజ సందర్భంగా అయోధ్యలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీజీ బలగాలు ఇప్పటికే అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రముఖులంతా భౌతికదూరం పాటిస్తూనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో అయోధ్య చేరుకున్నారు. లక్నో విమానాశ్రయం నుంచి ప్రత్యేక సైనిక హెలికాప్టర్లో అయోధ్య చేరుకున్న ఆయనకు కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉన్నత అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి సుప్రసిద్ధ హనుమన్ ఆలయానికి ఆయన వెళ్లారు.
అయోధ్యలో రామ ఆలయం భూమిపూజ సందర్భంగా నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయాన్ని బుధవారం రంగోళీలతో తీర్చిదిద్దారు. ప్రతిపాదిత ఆలయం నమూనాను ప్రధాన కార్యాలయంలో కళాకారులు తీర్చిదిద్దారు. అలాగే ‘జై శ్రీరామ్’ నినాదాన్ని చిత్రించారు. అలాగే గుజరాత్ గాంధీనగర్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా రామ ఆలయ నమూనాను రంగులు, పూలతో అందంగా తీర్చిదిద్దారు.
Tags
సంబంధిత వార్తలు
Arvind Kejriwal Challenges PM Modi: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్, రేపు బీజేపీ ఆఫీస్ కు వస్తా మీ ఇష్టం వచ్చినవాళ్లను అరెస్ట్ చేసుకోండి
PM Modi on Pakistan:పాకిస్థాన్ పరిస్థితి చూశారుగా! కాంగ్రెస్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
Bengaluru High Alert: వణికిస్తున్న డెంగ్యూ కేసులు, బెంగళూరులో హైఅలర్ట్, నగరంలో ఏకంగా 172 డెంగ్యూ కేసులు నమోదు
Arvind Kejriwal Bail Plea: ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్, తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, చరిత్రలో తొలిసారిగా పార్టీ పేరును నిందితులుగా పేర్కొన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
Telangana Techie Dies in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణ యువకుడు అక్కడికక్కడే మృతి, ఒక ప్రమాదం నుంచి బయటపడినా మరో ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు..
Hyderabad Rain Videos: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అవస్థల వీడియోలు ఇవిగో, రెండు గంటల పాటు హడలెత్తించిన వాన, రహదారులన్నీ జలమయం, భారీగా ట్రాఫిక జాం
Andhra Pradesh Elections 2024: ఆకస్మిక బదిలీలే హింసకు కారణం, ఈసీకి నివేదిక సమర్పించిన సీఎస్, డీజీపీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు
Covaxin Side Effects: కొవాగ్జిన్ టీకా తీసుకున్న మహిళల్లో పడిపోతున్న ప్లేట్లెట్లు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి, కౌమారదశలో ఉన్న మహిళలకు ఏఈఎస్ఐ ముప్పు
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Ex Minister Mallareddy Arrest: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
BCCI Bans Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ఐపీఎల్ -2025 సీజన్ లో తొలి మ్యాచ్ కు హార్దిక్ పై బీసీసీఐ నిషేధం.. రూ. 30 లక్షల భారీ జరిమానా కూడా
Guru Charan Singh: కనిపించకుండా పోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఎట్టకేలకు ఇంటికి.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే??
Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి.. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని పేర్కొంటూ దాడి చేసిన వ్యక్తులు (వీడియో వైరల్)