SC on Crackers Ban: ప్రజల ప్రాణాలు ముఖ్యం, టపాసులు కాదు, టపాసులు కాల్చకూడదనే నిషేధాన్ని ఎత్తి వేయాలంటూ వేసిన పిటిషన్‌ని తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం

కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పటాకుల నిషేధానికి మద్దతుగా సుప్రీంకోర్టు (Suprem Court) కీలక తీర్పును వెలువరించింది. పండుగ సీజన్లో పశ్చిమ బెంగాల్‌లో ప‌టాకులు కాల్చ‌డంపై నిషేధం (Cracker Ban) విధించ‌డాన్ని స‌వాల్‌ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పండుగ‌లు జురుపుకోవ‌డం ముఖ్య‌మేన‌ని, అయితే పండుగ‌ల కంటే ప్ర‌జ‌ల జీవితాలు ఇంకా ముఖ్య‌మ‌ని (preserving life more important) పేర్కొన్న‌ది.

Supreme Court of India | Photo-IANS)

New Delhi, Nov 11: కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పటాకుల నిషేధానికి మద్దతుగా సుప్రీంకోర్టు (Suprem Court) కీలక తీర్పును వెలువరించింది. పండుగ సీజన్లో పశ్చిమ బెంగాల్‌లో ప‌టాకులు కాల్చ‌డంపై నిషేధం (Cracker Ban) విధించ‌డాన్ని స‌వాల్‌ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పండుగ‌లు జురుపుకోవ‌డం ముఖ్య‌మేన‌ని, అయితే పండుగ‌ల కంటే ప్ర‌జ‌ల జీవితాలు ఇంకా ముఖ్య‌మ‌ని (preserving life more important) పేర్కొన్న‌ది.

పండుగ‌ల ఎంత ప్రాముఖ్య‌త క‌లిగిన‌వో మ‌న అంద‌రికీ తెలుస‌ని, అయితే ప్ర‌స్తుతం మ‌నం క‌రోనా వైర‌స్‌తో పోరాడుతున్నామ‌ని, ఇలాంటి స‌మ‌యంలో ప‌రిస్థితిని మెరుగుప‌ర్చ‌డానికి తీసుకునే నిర్ణ‌యాల‌కు క‌లిసిక‌ట్టుగా మ‌ద్ద‌తు నిలువాల‌ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి డీవై చంద్ర‌చూడ్ (Justices DY Chandrachud) సూచించారు.

కరోనా థ‌ర్డ్ వేవ్‌తో వణుకుతున్న దేశ రాజధాని, భారత్‌లో 86 ల‌క్ష‌లు దాటిన కోవిడ్ కేసులు, గ‌త 24 గంటల్లో కొత్తగా 44,281 క‌రోనా కేసులు నమోదు

ఫైర్‌క్రాకర్ నిషేధానికి వ్యతిరేకంగా కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చేసిన పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ డివై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీ ధర్మాసనం పండుగల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని పిటిషన్ ను కొట్టివేసింది. పండుగ‌లు చాలా ముఖ్యం అనే సంగ‌తి మాకు తెలుసు. కానీ ప్ర‌జ‌ల ప్రాణాలు ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు వారిని కాపాడుకోవ‌డం కోసం ఏదో ఒక ప్ర‌య‌త్నం త‌ప్ప‌క జ‌రుగుతుండాలి. అలాంటి ప్రయ‌త్నాల‌కు అంద‌రూ స‌హ‌క‌రించాలి' అని జ‌స్టిస్ చంద్ర‌చూడ్ పేర్కొన్నారు.

మనం కరోనా మహమ్మారి మధ్య జీవిస్తున్నాము మరియు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వడానికి ముందుకు రావాలి ఈ పరిస్థితిని మెరుగుపరిచే నిర్ణయం "అని జస్టిస్ డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత మహమ్మారిలో ప్రాణాలను కాపాడటం కంటే మరేమీ ముఖ్యమైనది కాదు. ఇప్పుడు మీ జీవితం కూడా ప్రమాదంలో ఉంది మరియు సమస్యను పరిష్కరించడానికి ప్రజలు కలిసి రావాలి" అని ఆయన అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now