Tamil Nadu Shocker: తమిళనాడులో తీవ్ర విషాదం, జావెలిన్ త్రోయర్ విసిరిన స్టిక్ తలకు గుచ్చుకుని విద్యార్థి మృతి, పాఠశాల నుండి ఇంటికి వెళుతుండగా ఘటన

తమిళనాడులో జరిగిన దురదృష్టకర ఘటనలో 15 ఏళ్ల బాలుడు తలకు జావెలిన్ స్టిక్ తగిలి మృతి చెందిన విషయం తెలిసిందే. గత వారం కడలూరు జిల్లాలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ సెషన్‌లో 10వ తరగతి విద్యార్థి తలకు జావెలిన్ త్రో స్టిక్ తగిలిన సంఘటన జరిగింది. టి కిషోర్‌గా గుర్తించిన మృతుడు జూలై 30 మంగళవారం తుది శ్వాస విడిచాడు.

Dead (Credits: X)

Chennai,July 31: తమిళనాడులో జరిగిన దురదృష్టకర ఘటనలో 15 ఏళ్ల బాలుడు తలకు జావెలిన్ స్టిక్ తగిలి మృతి చెందిన విషయం తెలిసిందే. గత వారం కడలూరు జిల్లాలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ సెషన్‌లో 10వ తరగతి విద్యార్థి తలకు జావెలిన్ త్రో స్టిక్ తగిలిన సంఘటన జరిగింది. టి కిషోర్‌గా గుర్తించిన మృతుడు జూలై 30 మంగళవారం తుది శ్వాస విడిచాడు.

ఘటన అనంతరం కిషోర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం , ఈ సంఘటన జూలై 24న కడలూరు జిల్లాలోని వడలూరు పట్టణంలో జరిగింది, కిషోర్ సాయంత్రం 5 గంటలకు పాఠశాల ఆవరణ నుండి బయలుదేరుతున్నప్పుడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో మరో విద్యార్థి విసిరిన జావెలిన్‌ కిషోర్‌ తలకు కుడివైపున తగిలిందని పోలీసు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్థరాత్రి కారు బీభత్సం వీడియో ఇదిగో, మద్యం మత్తులో బీటెక్ స్టూడెంట్ ర్యాష్ డ్రైవింగ్, ఇద్దరికి తీవ్ర గాయాలు

అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను జూలై 30 న మరణించాడు. కేసు నమోదు చేయగా, పాఠశాలలో పూర్తి సమయం శిక్షణ పొందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేరని ప్రాథమికంగా తేలింది. షూల్‌లో జావెలిన్ త్రో శిక్షణ కోసం ప్లేగ్రౌండ్ సౌకర్యాలు కూడా లేవని పోలీసులు తెలుసుకున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now