Ban On Basmati Rice Exports: నిన్న ఉప్పుడు బియ్యం, ఇవాళ బాస్మతి బియ్యంపై కేంద్రం ఆంక్షలు, అన్ని రకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు

అన్నిరకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై (Basmati Rice Exports) కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధాజ్ఞ‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో కేంద్రం వెల్లడించింది. టన్నుకు 1200 డాలర్లు (సుమారు రూ.99,058) కంటే తక్కువ ధర గల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం అమలవుతుంది.

Ban On Basmati Rice Exports: నిన్న ఉప్పుడు బియ్యం, ఇవాళ బాస్మతి బియ్యంపై కేంద్రం ఆంక్షలు, అన్ని రకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై  నిషేదం విధిస్తూ ఉత్తర్వులు
Ban On Basmati Rice Exports (PIC@Wikimedia Commons)

New Delhi, AUG 27: అన్నిరకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై (Basmati Rice Exports) కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధాజ్ఞ‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్‌లో కేంద్రం వెల్లడించింది. టన్నుకు 1200 డాలర్లు (సుమారు రూ.99,058) కంటే తక్కువ ధర గల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం అమలవుతుంది. ఈ నిషేధం తాత్కాలికమేనని కూడా కేంద్రం వెల్లడించింది. ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది కేంద్రం. వచ్చే అక్టోబర్ 16 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

G20 Summit 2023: సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జీ20 శిఖరాగ్ర సమావేశాలు, ఢిల్లీలో సెప్టెంబర్ 8 సాయంత్రం నుంచి మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు 

ఈ ఏడాది పలు రకాల బియ్యం ఎగుమతులపై నిషేధం, ఆంక్షలు విధించి కేంద్రం. గతేడాది 74 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం విదేశాలకు ఎగుమతి చేశారు. దేశీయంగా ఉప్పుడు బియ్యం ధర రికార్డు స్థాయికి పెరిగిపోవడంతో.. దేశీయంగా అవసరాలకు సరిపడా బియ్యం స్టాక్ నిర్వహణ కోసం ఎగుమతిపై నిషేధం విధించింది.

G20 Summit 2023: అరెస్ట్ భయం, భారత్‌లో జరగనున్న జీ20 సమ్మిట్‌కు దూరంగా పుతిన్, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ రష్యా అధ్యక్షుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం 

విదేశాలకు ఉప్పుడు బియ్యం ఎగుమతిపై కేంద్రం సుంకం విధించడంతో పాకిస్థాన్, థాయిలాండ్ దేశాల్లో బియ్యం ధరలు పెరిగాయి. విదేశీ వ్యాపారులు సైతం ఇతర దేశాల నుంచి చౌకగా బియ్యం దిగుమతి చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా 40 శాతానికి పై చిలుకే. గత నెలలో బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. దేశీయంగా బియ్యం సరఫరా పెంపుదలకు, ధరల నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నది. బియ్యం ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడంతో ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు 12 ఏండ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

Maha Kumbh 2025: త్రివేణి సంగంమంలో పుణ్యస్నానం ఆచరించిన 50 కోట్ల మంది భక్తులు, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని తెలిపిన యూపీ ప్రభుత్వం

Andhra Pradesh Acid Attack Case: యువ‌తిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి, నా చెల్లెలికి అండగా ఉంటానని తెలిపిన నారా లోకేష్, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

Vallabhaneni Vamsi Mohan Arrest: డీజీపీ అప్పాయింట్‌మెంట్ ఇస్తే వచ్చాం, అయినా కలవకుండా వెళ్లిపోయారు, తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన అంబటి రాంబాబు

Andhra Pradesh Horror: అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి, ప్రేమోన్మాది తనకు దక్కలేదనే కోపంతో కక్షకట్టి మరీ..

Share Us