DK Shivakumar Meets PM Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ భేటీ, ఏయే అంశాల‌పై చ‌ర్చించారంటే?

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కలిశారు. (DK Shivakumar Meets PM) బెంగళూరు అభివృద్ధి, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. గుజరాత్‌ గిఫ్ట్ సిటీ తరహాలో బెంగళూరును అభివృద్ధి చేయాలని కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని చెప్పారు

DK Shivakumar Meets PM Modi

New Delhi, July 31: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కలిశారు. (DK Shivakumar Meets PM) బెంగళూరు అభివృద్ధి, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. గుజరాత్‌ గిఫ్ట్ సిటీ తరహాలో బెంగళూరును అభివృద్ధి చేయాలని కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని చెప్పారు. ఆ అభ్యర్థనను సానుకూలంగా పరిగణించకపోవడంతో టన్నెల్ ప్రాజెక్ట్, సిగ్నల్ రహిత కారిడార్, ప్రధాన రహదారులు, బెంగుళూరులో తుఫాను నీటి కాలువల అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం మరిన్ని నిధులు కోరామని అన్నారు. కాగా, జాతీయ ఖజానాకు అత్యధిక పన్నులు అందజేసే రెండో మహానగరం బెంగళూరు అని డీకే శివకుమార్‌ తెలిపారు. అయితే కేంద్ర బడ్జెట్‌లో ఏమీ కేటాయించలేదని విమర్శించారు. అందుకే మౌలిక సదుపాయాలకు నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ఎగువ తుంగభద్ర ప్రాజెక్టుపై గత బడ్జెట్‌లో రూ. 5,300 కోట్లు కేటాయించినప్పటికీ కేంద్రం ఎలాంటి నిధులను విడుదల చేయకపోవడాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.

 

మరోవైపు తమిళనాడుకు నిర్దేశిత నీటి కంటే అదనపు నీటిని జూలైలో విడుదల చేయడంపై ప్రధాని మోదీకి వివరించినట్లు డీకే శివకుమార్ తెలిపారు. మహాదాయి సమస్యపై జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. అయితే రెండు రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించినట్లు వెల్లడించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Advertisement
Share Now
Advertisement