Uttar Pradesh: ఘోర విషాదం, కొడుకు బర్త్‌డే కేక్‌ కట్‌ చేస్తూ గుండెపోటుతో తండ్రి మృతి, అప్పుల వాళ్ల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కలకలం రేపుతున్న వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ కాలనీలో కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. వడ్డీ వ్యాపారుల వల్లే తమ కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Representative image. (Photo Credits: Unsplash)

Lucknow, Sep 7: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కలకలం రేపుతున్న వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ కాలనీలో కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. వడ్డీ వ్యాపారుల వల్లే తమ కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటన అందరినీ షాకింగ్ కు గురి చేసింది.

ఇది లక్నోలోని చిన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ములాయం నగర్ కేసు. ఇక్కడ సుశీల్ శర్మ (45 సంవత్సరాలు) తన భార్య కిరణ్, ముగ్గురు పిల్లలు సాక్షి, సార్థక్, మన్నత్‌లతో కలిసి నివసిస్తున్నారు. బుధవారం రాత్రి సునీల్ తన కొడుకు సార్థక్ బర్త్ డే కేక్ కట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. సునీల్ మృతి చెందినట్లు గుర్తించారు. మరణానికి కారణం గుండెపోటు అని డాక్టర్ చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంచనామాకు తరలించారు.

వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్, సహచరులు వేగంగా స్పందించి సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు

భార్య కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి వద్ద 22 లక్షల రూపాయల అప్పు ఉందని, ప్రతినెలా 70 వేల రూపాయల వరకు వాయిదాలు వచ్చేవి. ఈ నెల, వాయిదా తగ్గించినప్పుడు రుణదాత చాలా అవమానించాడు. దీంతో సునీల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని తెలిపారు. ఈస్ట్ జోన్ ఏడీసీపీ అలీ అబ్బాస్ తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. దీనిపై ఏదైనా ఫిర్యాదు అందితే నిందితులపై చర్యలు తీసుకుంటాం. వడ్డీకి డబ్బులు తీసుకునేందుకు కుటుంబసభ్యులు మాట్లాడుకున్నారు. అదే కారణంతో సునీల్ ఆందోళన చెందాడని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement