Uttar Pradesh Honour Killing: యూపీలో పరువు హత్య కలకలం, కూతురుని, ఆమె ప్రియుడిని గడ్డపారతో దారుణంగా పొడిచి చంపిన తండ్రి

బదౌన్ జిల్లాలో జరిగిన పరువు హత్య ఘటనలో మంగళవారం తెల్లవారుజామున మహేష్ అనే వ్యక్తి తన కుమార్తెను, ఆమె ప్రియుడిని నరికి చంపాడు. అనంతరం మహేష్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.నివేదికల ప్రకారం, 20 ఏళ్ల సచిన్ తన స్నేహితురాలిని కలవడానికి ఆమె ఆహ్వానంపై వచ్చాడు

Representative Image (Photo Credit- PTI)

బదౌన్, జనవరి 2 : బదౌన్ జిల్లాలో జరిగిన పరువు హత్య ఘటనలో మంగళవారం తెల్లవారుజామున మహేష్ అనే వ్యక్తి తన కుమార్తెను, ఆమె ప్రియుడిని నరికి చంపాడు. అనంతరం మహేష్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.నివేదికల ప్రకారం, 20 ఏళ్ల సచిన్ తన స్నేహితురాలిని కలవడానికి ఆమె ఆహ్వానంపై వచ్చాడు. అమ్మాయి కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిరేకంగా ఇద్దరూ దాదాపు రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో బాలిక తండ్రి నిద్రలేచి చూడగా సచిన్‌తో మాట్లాడుతున్న కూతురు కనిపించింది. ఆవేశంలో గడ్డపార తీసుకుని యువ జంటపై దాడి చేసి అక్కడికక్కడే ఇద్దరినీ చంపేశాడు. అనంతరం మహేష్ బిల్సీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పరువు హత్య కలకలం, ప్రేమికులను చంపి మృతదేహాలను చంబల్ నదిలో మొసళ్లకు ఆహారంగా పడేసిన యువతి ఫ్యామిలీ

చనిపోయిన ప్రేమికులు ఒకే కులానికి చెందిన వారని తెలిపారు. బదౌన్ SSP, డాక్టర్ ఓంప్రకాష్ సింగ్, సంఘటన స్థలాన్ని పరిశీలించి, విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. సచిన్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు బాలిక తండ్రిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh Assembly Session 2025: స్వర్ణాంధ్ర 2047 కోసం రోడ్ మ్యాప్, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఏపీ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, అనంతరం సభ రేపటికి వాయిదా

Andhra Pradesh Assembly Session 2025: అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో మాట్లాడలేం, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి

Pawan Kalyan At Apollo Hospital: అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్.. హెల్త్ చెకప్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం... ఫొటోలు వైరల్

Special Buses For Maha Shivarathri: మహాశివరాత్రి సందర్భంగా శివయ్య దర్శనానికి వెళ్లాలనుకున్నవారికి గుడ్ న్యూస్.. 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Share Now