Exit Poll Results 2022: మళ్లీ ఊడ్చేసిన చీపురు, ఎంసీడీ అరవింద్ కేజ్రీవాల్దే, బీజేపీకి షాకిస్తున్న ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్కు ఘోర పరాభవమేనంటున్న పలు ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి సత్తా చాటనుందని పలు ఎగ్జిట్ పోల్స్ ( Exit Poll Results 2022) చెబుతున్నాయి.250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం (AAP Likely to Emerge As Single Largest Party) ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.
New Delhi, Dec 5: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి సత్తా చాటనుందని పలు ఎగ్జిట్ పోల్స్ ( Exit Poll Results 2022) చెబుతున్నాయి.250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం (AAP Likely to Emerge As Single Largest Party) ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.
భారతీయ జనతా పార్టీకి (BJP Distant Second in Delhi Municipal ) 69 నుంచి 91 సీట్లు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ దారుణంగా చతికిలపడింది. 3 నుంచి 7 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇతరులు 5 నుంచి 9 వార్డుల్లో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్లో తేలింది. ఇవి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రమే. వాస్తవ ఫలితాలు ఈ నెల 7న విడుదల అవుతాయి.
కాగా ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 250 వార్డులున్న ఎంసీడీలో మొత్తం 1349 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వీరిలో 709 మంది మహిళలున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈసీ అధికారులు 13,638 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 1.45 కోట్ల మంది. ఈస్ట్, సౌత్, నార్త్ మున్సిపల్ కార్పొరేషన్లను ఒక్క మున్సిపల్ కార్పొరేషన్గా (ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) మార్చాక జరిగిన తొలి ఎన్నికలివి. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. 40 వేల మంది పోలీసులు, 20 వేల మంది హోం గార్డులు, 108 కంపెనీల పారామిలిటరీ, రాష్ట్రాల పోలీస్ బలగాలు రక్షణ బాధ్యతల్లో నిర్వహించారు.
అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోదీ.. ప్రజలు ప్రజాస్వామ్యం పండుగను గొప్పగా జరుపుకుంటున్నారని హర్షం
కాగా 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను ఏలుతున్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని యోచిస్తోంది. ఇందుకోసం ఎన్నికల్లో పలు తాయిలాలను ప్రకటించింది. ముఖ్యంగా మురికివాడల్లో క్కడ గుడిసె ఉంటే అక్కడే పక్కా ఇల్లు కట్టుకోవచ్చంటూ ప్రచారంతో మార్మోగించింది. 2017 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 26 శాతం ఓటింగ్ సాధించింది. గత ఎంసీడీ ఎన్నికల్లో 21 శాతం ఓటింగ్ సాధించిన కాంగ్రెస్ ఈ సారి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 126 సీట్లు సాధిస్తే మ్యాజిక్ నెంబర్ సాంధిచినట్లే.. అయితే ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీవైపు మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి నెలకొని ఉంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)