Isudan Gadhvi: ఆప్ నుంచి గుజరాత్ సీఎం అభ్యర్థిగా జర్నలిస్ట్ ఇసుదన్ గాధ్వి, రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడతలో 89 స్థానాలకు, రెండవ విడతలో 93 స్థానాలకు పోలింగ్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గుజరాత్లో తమ పార్టీ తరపున పోటీపడే సీఎం అభ్యర్థిని ఆమ్ ఆద్మీ ప్రకటించింది. ఆప్ జాతీయ కార్యదర్శి ఇసుదన్ గాధ్విని గుజరాత్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
Gandhi Nagar, Nov 4: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గుజరాత్లో తమ పార్టీ తరపున పోటీపడే సీఎం అభ్యర్థిని ఆమ్ ఆద్మీ ప్రకటించింది. ఆప్ జాతీయ కార్యదర్శి ఇసుదన్ గాధ్విని గుజరాత్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ ఒకటో తేదీన తొలి దఫా, అయిదవ తేదీన రెండో దఫా ఎన్నికలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడులో 89 స్థానాలకు, రెండవ విడతలో 93 స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.
సీఎం అభ్యర్థి గాధ్వి.. జర్నలిస్టుగా పనిచేశారు. మొదట దూరదర్శన్లో పనిచేశారు. తర్వాత జర్నలిస్టుగా తన కెరీర్లో, గుజరాత్లోని డాంగ్ జిల్లాలో 150 కోట్ల అటవీ నిర్మూలన కుంభకోణాన్ని బయటపెట్టాడు. ఈ క్రమంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. కాగా, 2021లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.