Jharkhand Political Crisis: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం, ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలింపు, బేగంపేట ఎయిర్‌పోర్టులో రెడీగా ఉన్న బస్సులు, వీడియోలు ఇవిగో..

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం (Jharkhand Political Crisis) మధ్య, రాష్ట్రంలోని జెఎంఎం నేతృత్వంలోని సంకీర్ణం బిజెపి వేట ప్రయత్నాలను నిరోధించడానికి తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించేందుకు రంగం సిద్ధం అయింది.

JMM-led alliance MLAs shifted to Hyderabad to prevent BJP's poaching attempt

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం (Jharkhand Political Crisis) మధ్య, రాష్ట్రంలోని జెఎంఎం నేతృత్వంలోని సంకీర్ణం బిజెపి వేట ప్రయత్నాలను నిరోధించడానికి తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించేందుకు రంగం సిద్ధం అయింది.మా శాసనసభ్యులను హైదరాబాద్‌కు తరలించడానికి రెండు చార్టర్డ్ విమానాలు - ఒకటి 12 సీట్లు మరియు మరొకటి 37 సీట్లు - బుక్ చేయబడ్డాయి" అని వర్గాలు తెలిపాయి.దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

జార్ఖండ్ సీఎం ప‌ద‌వికి హేమంత్ సోరెన్ రాజీనామా, తదుప‌రి ముఖ్య‌మంత్రిగా జార్ఖండ్ టైగ‌ర్ గా పేరొందిన నేత ఎంపిక‌

జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేత చంపై సోరెన్ గురువారం మధ్యాహ్నం 5 గంటల ప్రాంతంలో గవర్నర్‌ను సీపీ రాధాకృష్ణన్‌ను కలుసుకున్నారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖను గవర్నర్‌కు ఆయన అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా రాజ్‌భవన్‌ నుంచి ఆహ్వానం అందలేదు.  ఊహించిందే జ‌రిగింది! హేమంత్ సోరెన్ అరెస్ట్, భూకుంభ‌కోణం కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ, ఆరుగంట‌ల పాటూ విచారించిన త‌ర్వాత అరెస్ట్

దీంతో ఎమ్మెల్యేలు జేజారిపోకుండా ఉండేందుకు అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం మద్ధతుగా ఉన్న 47 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేల కోసం బేగంపేట ఎయిర్ పోర్టులో ఎదురుచూస్తున్నారు. రాగానే వారిని హోటల్ కు తరలించేందుకు బస్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి.

Here's Videos

అందుబాబులో ఉన్న సుమారు 35 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. వాళ్లను బేగంపేట నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు చంపయ్‌ సోరెన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని బీజేపీ అంటోంది. తగినంత మద్ధతు లేకపోవడమే అందుకు కారణమని చెబుతోంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now