Maharashtra: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర సర్కారుకు అనుకూలంగా ఓటు వేసిన 164 మంది ఎమ్మెల్యేలు, విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి 99 ఓట్లు
ఈ ఉదయం జరిగిన విశ్వాస పరీక్షలో షిండే (Maharashtra CM Eknath Shinde) విజయం సాధించారు. శాసన సభలో జరిగిన ఓటింగ్ లో షిండేకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు.
- Read in
- English
Mumbai, July 4; మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే తన బలాన్ని నిరూపించుకున్నారు. ఈ ఉదయం జరిగిన విశ్వాస పరీక్షలో షిండే (Maharashtra CM Eknath Shinde) విజయం సాధించారు. శాసన సభలో జరిగిన ఓటింగ్ లో షిండేకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు. ఇందులో 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన షిండే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా (Chief Minister Eknath Shinde) తన అధికారాన్ని కాపాడుకున్నారు. ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి.
నిన్నటిదాకా అఘాడి కూటమితో ఉన్న శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంతోష్ బాంగర్ చివరి నిమిషంలో థాకరేకు షాకిచ్చారు. బల పరీక్షలో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. షిండేకు మద్దతుగా బీజేపీతోపాటు బహుజన్ వికాస్ అఘాడి కూడా ఓటు వేసింది. ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మహా వికాస్ అఘాడి కూటమిలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు సమాజ్ వాద్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు వేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు
కొన్ని వారాల నుంచి సాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సంక్షోభం అనూహ్య మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. శివసేన రెబల్గా షిండే తిరుగుబాటు చేయడంతో ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఏక్నాథ్ సీఎం అయ్యారు.
Tags
సంబంధిత వార్తలు
Arvind Kejriwal Challenges PM Modi: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్, రేపు బీజేపీ ఆఫీస్ కు వస్తా మీ ఇష్టం వచ్చినవాళ్లను అరెస్ట్ చేసుకోండి
Telangana: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, పంట కొనుగోళ్లపై పలు డిమాండ్లు..లేకపోతే ఉద్యమ కార్యాచరణ మొదలు పెడతామంటూ హెచ్చరిక
PM Modi on Pakistan:పాకిస్థాన్ పరిస్థితి చూశారుగా! కాంగ్రెస్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
Lok Sabha Election 2024 Result Prediction: బీజేపీ 400 సీట్ల మార్క్ దాటుతుందా ? కాంగ్రెస్ పుంజుకుంటుందా, ఫలోడి సత్తా మార్కెట్ లేటేస్ట్ అంచనాలు ఇవిగో..
Sushil Kumar Modi No More: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత.. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న సుశీల్.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
Lok Sabha Elections 2024: తొలి రెండు గంటల్లో పిఠాపురంలో 10.02 శాతం పోలింగ్ నమోదు, ఉదయం 9 గంటలకు ఏపీలో 9.05శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదైందని తెలిపిన అధికారులు
Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై పీఎం మోదీ, అమిత్ షా స్పెషల్ ట్వీట్స్, రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్లో పాల్గొనాలని పిలుపు
PM Modi in Hyderabad: యూపీఏ హయాంలో హైదరాబాద్ లో ఎన్ని పేలుళ్లు జరిగాయో గుర్తు తెచ్చుకోండి! సీఏఏను వ్యతిరేకించేవారికి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ప్రధాని మోదీ
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Ex Minister Mallareddy Arrest: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
BCCI Bans Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ఐపీఎల్ -2025 సీజన్ లో తొలి మ్యాచ్ కు హార్దిక్ పై బీసీసీఐ నిషేధం.. రూ. 30 లక్షల భారీ జరిమానా కూడా
Guru Charan Singh: కనిపించకుండా పోయిన ప్రముఖ బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఎట్టకేలకు ఇంటికి.. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే??
Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి.. దేశాన్ని విభజించాలని కన్హయ్య అన్నారని పేర్కొంటూ దాడి చేసిన వ్యక్తులు (వీడియో వైరల్)