Telangana: సిఎఎకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానిస్తే గవర్నర్ తమిళిసై అదే పనిచేస్తారా? కేరళ గవర్నర్ను అనుసరించనున్న తెలంగాణ గవర్నర్
ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఇక రైతుబంధు నిధులు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షం సిద్ధమవుతోంది.....
Hyderabad, March 02: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Session) మార్చి 06 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే పౌరసత్వ సవరణ చట్టంను (CAA) వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ (CM K Chandrashekar Rao) ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (Governor Tamilisai Soundararajan) ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సమావేశాల ప్రారంభానికి ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రసంగం ద్వారా తెలంగాణ ప్రభుత్వ విధానం, ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ, సిఎఎను తమ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందో సానుకూల దృక్పథంతో గవర్నర్ చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళిసై అంతకుముందు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో నేడు ఒక గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాన్నే వ్యతిరేకించడమే కాకుండా, ఈ విషయంలో తన సొంత పార్టీ అయిన బీజేపీ వైఖరిని ఎండగడుతూ గవర్నర్ తమిళిసై తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగించాల్సి ఉంటుంది.
అయితే ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి గవర్నర్ తమిళిసై ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రసంగం విషయంలో కేరళ గవర్నర్ పంథానే తాను అవలింబించాలనే నిర్ణయం తమిళిసై తీసుకున్నారని నివేదికలు వెల్లడించాయి. కేరళ అసెంబ్లీ సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానం చేసే సమయంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ "నేను ఈ ప్యారాగ్రాఫ్ ఎందుకు చదవాల్సి వస్తుందంటే సీఎం పినరయి విజయన్ చదవమన్నారు కాబట్టి చదువుతున్నాను. నిజానికి ఇది నిబంధనలకు విరుద్ధం, అయినప్పటికీ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇది వారి ప్రభుత్వ వైఖరి కాబట్టి, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇది చదువుతున్నాను" అంటూ సిఎఎ వ్యతిరేక తీర్మానంపై ప్రసంగం చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా అవలంబించనున్నారని రిపోర్ట్స్ వెల్లడించాయి. అసదుద్దీన్ ఇలాఖాలో అమిత్ షా షో.. సిఎఎకు మద్ధతుగా హైదరాబాద్లో బీజేపీ మెగా ర్యాలీ
ఇదిలా ఉండగా మార్చి 06 నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలలో 2020-21కి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం సమర్పించనుంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఇక రైతుబంధు నిధులు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షం సిద్ధమవుతోంది.
Tags
సంబంధిత వార్తలు
2024 భారతదేశం ఎన్నికలు: ప్రధాని మోదీ బహుశా స్టేజి మీదనే ఏడుస్తారేమో! ఎన్నికల ప్రచారంలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు, ఇక రెండో దశ పోలింగ్ పై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
Orange Alert for Telangana: మండుతున్న ఎండలు, తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్, వచ్చే 5 రోజులు వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక
Hyderabad Fire: వీడియోలు ఇవిగో, భారీ అగ్నిప్రమాదంలో భయంతో బిల్డింగ్ పై నుండి దూకుతున్న సిబ్బంది, మంటల్లో చిక్కుకున్న 50 మంది
Lok Sabha Polls Phase II: ముగిసిన రెండో దశ పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు 13 రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం ఇదిగో..
Telugu States Weather Update: మరో మూడు రోజులు వడగాడ్పులు మరింతగా పెరిగే అవకాశం, తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
Harish Rao Vs Revanth Reddy: ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ సవాల్, రాజీనామా లేఖతో వచ్చిన హరీష్ రావు, దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా లేఖతో రావాలని ఛాలెంజ్
2024 భారతదేశం ఎన్నికలు: దేశవ్యాప్తంగా మొదలైన లోక్ సభ రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్.. 15.88 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు అవకాశం.. బరిలో రాహుల్ గాంధీ సహా అతిరథులు
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు, విదేశాల్లో దాక్కున్న ప్రభాకర్రావుపై రెడ్ కార్నర్ నోటీసులు, నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
CM Revanth Reddy: మోడీ, అమిత్ షా అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి పడేస్తుంది. -సీఎం రేవంత్ రెడ్డి
Palestinian Baby Dies: బాంబుల వర్షం కారణంగా గాజాలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి బయటకు తీసిన పసికందు మృతి
JEE Advanced Applications Today: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్ దరఖాస్తులు.. మే 7 వరకు తుది గడువు.. మే 26న పరీక్ష
Best Stews in The World: కీమా, కుర్మా, దాల్ తడ్కా.. ‘టేస్ట్ అట్లాస్’ బెస్ట్ స్టివ్స్ జాబితాలో తొమ్మిది భారతీయ వంటకాలు..