Bank Deposit Insurance: బ్యాంకు ఖాతాదారులకు పెద్ద భరోసా ఇచ్చిన మోదీ ప్రభుత్వం, ఇకపై బ్యాంకులు దివాళా తీసినా కచ్చితంగా డిపాజిటర్లకు 90 రోజుల్లో రూ.5 లక్షలు గ్యారెంటీ రిటర్న్...
గతంలో బ్యాంకులో జమ చేసిన మొత్తంలో రూ.50 వేల వరకు మాత్రమే గ్యారెంటీ ఉండేది. ఆ తర్వాత లక్ష రూపాయలకు పెంచారు. ఒకవేళ బ్యాంకు మునిగిపోతే డిపాజిటర్లకు లక్ష రూపాయల వరకు మాత్రమే వచ్చేలా నిబంధన ఉండేది. పేద, మధ్యతరగతి వర్గాల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచామని ప్రధాని మోదీ తెలిపారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఇకపై బ్యాంకులు దివాళా తీసి ఎత్తేసినా డిపాజిటర్లకు కనీసం మొత్తంగా రూ.5 లక్షలు వచ్చేలా (Bank Deposit Insurance) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అందులో భాగంగా ఆదివారం విజ్ఞాన్ భవన్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. గతంలో బ్యాంకులో జమ చేసిన మొత్తంలో రూ.50 వేల వరకు మాత్రమే గ్యారెంటీ ఉండేది. ఆ తర్వాత లక్ష రూపాయలకు పెంచారు. ఒకవేళ బ్యాంకు మునిగిపోతే డిపాజిటర్లకు లక్ష రూపాయల వరకు మాత్రమే వచ్చేలా నిబంధన ఉండేది. ఈ డబ్బును ఎప్పుడు స్వీకరించాలనే దానిపై కాలపరిమితి కూడా ఉండేది కాదు. పేద, మధ్యతరగతి వర్గాల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులు వివాదాల్లో చిక్కుకొని మూసివేత పరిస్థితి ఏర్పడితే, సామాన్యుల డబ్బుకు భరోసా లేకుండా పోయిందని, తద్వారా బాధితుడి కొడుకు, కూతుళ్ల ఫీజులు ఎక్కడ చెల్లిస్తారో, కూతురు పెళ్లి ఎలా చేస్తారో, చికిత్స ఎలా చేస్తారో అనే సమస్య ప్రజల ముందు ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. ఎందుకంటే ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల డిపాజిట్ చేసిన సొమ్ము అందకుండా పోయిందన్నారు. దేశ ప్రజలు దశాబ్దాలుగా ఈ సంక్షోభాన్ని భరిస్తున్నారు. ఇంతకుముందు ఈ ప్రశ్నలకు సమాధానం లేదు.
ఈ పరిస్థితిని మార్చేందుకు తమ ప్రభుత్వం చాలా సున్నితంగా నిర్ణయాలు తీసుకుందని, చట్టాన్ని మార్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఎక్కడైనా బ్యాంకును మూసివేస్తే, అందులో డిపాజిటర్లు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు పొందుతారు, అది కూడా 90 రోజుల్లోపు. ఇప్పటి వరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రూ.74 లక్షల కోట్లు పూర్తిగా భద్రంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా పాల్గొన్నారు.
అన్ని రకాల ఖాతాలు కవర్ చేయబడతాయి
డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకుల్లోని పొదుపులు, స్థిర, కరెంట్, రికరింగ్ డిపాజిట్లు వంటి అన్ని డిపాజిట్లను కవర్ చేస్తుంది. రాష్ట్ర, కేంద్ర, ప్రాథమిక సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా ఈ పరిధిలోకి వస్తాయి.ఈ చర్య బ్యాంకింగ్ రంగంలో ఒక పెద్ద సంస్కరణగా పరిగణించబడుతుంది. ఈ ప్రభుత్వం బ్యాంకు డిపాజిట్ బీమా కవరేజీని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఇప్పుడు దాదాపు 98.1 శాతం ఖాతాలు ఈ పరిధిలోకి వచ్చాయి.
DICGC గురించి
దేశంలోని బ్యాంకుల్లో రూ. 5 లక్షల వరకు డిపాజిట్ల భద్రతకు DICGC హామీ ఇస్తుంది. DICGC అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అనుబంధ సంస్థ, ఇది బ్యాంక్ డిపాజిట్లపై బీమా రక్షణను అందిస్తుంది.
ఇప్పుడు ప్రతి డిపాజిటర్ బ్యాంక్ మూసివేసిన సందర్భంలో అతని వద్ద ఉన్న అసలు , వడ్డీ మొత్తానికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బీమా చేయబడతారు. ఈ మొత్తంలో ప్రధాన మొత్తం , వడ్డీ మొత్తం రెండూ ఉంటాయి. అయితే అసలు మొత్తం రూ. 5 లక్షలు అయితే, మీరు అసలు మొత్తాన్ని మాత్రమే తిరిగి పొందుతారు, అప్పుడు వడ్డీ అందుబాటులో ఉండదు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)