Dussehra 2025: దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారు ? మంచి పై చెడు విజయం స్ఫూర్తిగా జరుపుకునే మహోత్సవం ప్రత్యేక కథనం ఇదిగో..

దసరా లేదా విజయదశమి ప్రతి భారతీయుడి జీవనంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఇది మంచి పై చెడు విజయం సాధించిన రోజున జరుపుకునే పండుగ. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగను విభిన్న సాంప్రదాయాలతో, పెద్ద ఉత్సాహంతో జరుపుకుంటారు.

Dussehra-Wishes

దసరా లేదా విజయదశమి ప్రతి భారతీయుడి జీవనంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఇది మంచి పై చెడు విజయం సాధించిన రోజున జరుపుకునే పండుగ. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగను విభిన్న సాంప్రదాయాలతో, పెద్ద ఉత్సాహంతో జరుపుకుంటారు. దసరా పండుగ ఆశ్వీయుజ మాసంలో  నవరాత్రులు నిర్వహించిన తర్వాత విజయదశమి రోజు ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ పండుగ వెనుక అనేక పురాణాల కథలు ఉన్నాయి, అవి ప్రతీ ఒక్కరినీ స్ఫూర్తిదాయకంగా చేస్తాయి.

1. రామాయణ పురాణ కథ: రాక్షసుడు రావణుడు సీతను అపహరిస్తాడు. ధర్మపాలకుడు శ్రీరాముడు తన సైన్యం, లక్ష్మణుడితో కలిసి రావణుని యుద్ధంలో ఓడించి సీతను రక్షిస్తాడు. దసరా పండుగను ఈ రావణ వధకు గుర్తుగా జరుపుకుంటారు. ముఖ్యంగా, ఈ రోజు రావణుడి పది తలలను అగ్ని ద్వారా దహనం చేయడం ఒక ప్రధాన ఆచారం.

శారదీయ నవరాత్రి 2025, ఈసారి నవరాత్రులు కాదు.. పది రోజులు పాటు దసరా ఉత్సవాలు, తేదీలు, ప్రత్యేకతలు, నవరాత్రుల గురించి పూర్తి వివరాలు ఇవిగో..

2. పాండవుల కథ: మద్య యుగంలో పాండవులు వనవాసం నుండి తిరిగి వచ్చినప్పుడు, తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై ఉంచిన రోజు విజయదశమి రోజుగా గుర్తించబడింది. అప్పటినుండి, ఈ రోజు జమ్మి చెట్టు పూజా, కొత్త వ్యాపార ప్రారంభాలు, పెట్టుబడులు మొదలుపెట్టడం వంటివి జరుగుతాయి.

3. దుర్గామాత కథ: జగద్మాత అయిన దుర్గాదేవి.. మహిషాసుర అనే రాక్షసుడిని 9 రాత్రులు నిరంతర యుద్ధం చేసి నాశనం చేశారు. మహిషాసురుడు బ్రహ్మ, విష్ణు, శివుని శక్తులను తీసుకొని రాక్షస శక్తితో దేవతల్ని ఓడించగలిగాడు. అయితే, దుర్గాదేవి అందరి ఆయుధాలతో మహిషాసురుడి సైన్యాన్ని, రాక్షసులను ఎదుర్కుని, చివరకు మహిషాసురుడిని హతం చేసింది. ఈ విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటారని ప్రతీతి. దుర్గాదేవి ఆయుధాలు ఏంటంటే శివుని శూలం, ఇంద్రుని వజ్రాయుధం, వరుణుని పాశం, బ్రహ్మదేవుని అక్షమాల, కమండలం, హిమవంతుడు సింహం వాహనంగా ఉన్నాయి. ఈ భీకర యుద్ధంలో, రాక్షసులైన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాస్కలుడు, బిడాలుడు వంటి దుష్ట శక్తులను దేవి నాశనం చేశారు.

దసరా వేడుకలు

రామలీలా ప్రదర్శనలు: ఉత్తర భారత రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలో రాముని జీవితం నాటకంగా ప్రదర్శిస్తారు.

దుర్గాపూజ: దుర్గాదేవి విగ్రహాలను పూజించి, 10వ రోజు నిమజ్జనం చేయడం సాధారణ ఆచారం.

జమ్మి చెట్టు పూజ: విజయదశమి రోజు జమ్మి ఆకులను ఇంట్లో, వ్యాపారాల్లో ఉంచి, బంధువులకు ఇవ్వడం ద్వారా శుభం, సంపదలు కలగుతాయని నమ్మకం ఉంది.

క్రొత్త ప్రారంభాలు: ఈ రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం మంచి సూచనగా భావిస్తారు.

సాంస్కృతిక వేడుకలు: పండుగ సమయంలో బీహారీ, బెంగాలీ ప్రాంతాల్లో జానపద పాటలు, నాట్యాలు, మతపరమైన పూజలతో ఉత్సవం ఘనంగా జరుగుతుంది.

దసరా పండుగ కేవలం ఆధ్యాత్మికతను మాత్రమే కాకుండా భారతీయ సాంప్రదాయం, సాంస్కృతిక వైవిధ్యాన్ని, మంచి పై చెడు గెలుపు భావనను ప్రతిబింబిస్తుంది. ప్రజలు ఈ పండుగను వినోదంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement