Woman Delivers Baby on KRSTC Bus: మానవత్వానికి మచ్చుతునక ఈ ఘటన.. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి బస్సులోనే కేరళ వైద్యుల ప్రసవం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వైరల్ వీడియో ఇదిగో!!

కేరళలో మానవత్వం పరిమళించే ఘటన ఇది. మలప్పురానికి చెందిన ఓ 37 ఏళ్ల నిండు గర్భిణి కేఎస్ ఆర్టీసీ బస్సులో త్రిస్సూర్ నుంచి కోజీకోడ్ లోని తొట్టిపాలేనికి బయలుదేరింది.

Woman Delivers Baby on KRSTC Bus (Credits: X)

Newdelhi, May 31: కేరళలో (Kerala) మానవత్వం పరిమళించే ఘటన ఇది. మలప్పురానికి చెందిన ఓ 37 ఏళ్ల నిండు గర్భిణి (Pregnant Women) కేఎస్ ఆర్టీసీ బస్సులో (KSRTC Bus) త్రిస్సూర్ నుంచి కోజీకోడ్ లోని తొట్టిపాలేనికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని బస్సులోని ప్రయాణికులు డ్రైవర్ కు తెలియజేయడంతో అతను సమయస్ఫూర్తితో ఆలోచించి బస్సు రూటు మార్చాడు. సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఎమర్జెన్సీ డెలివరీ గురించి ఫోన్లో తెలియజేసి బస్సును నేరుగా అక్కడికే పోనిచ్చాడు.

ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు

స్ట్రెచర్ తో సిద్ధంగా ఉన్నప్పటికీ..

అప్పటికే అక్కడ స్ట్రెచర్ తో సిద్ధంగా సిబ్బంది ఆమెను ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో వైద్యులు, నర్సులు హుటాహుటిన బస్సులోకే చేరుకొని ప్రసవం చేసి తల్లీబిడ్డను కాపాడారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బస్సు డ్రైవర్, ఆసుపత్రి వైద్య బృందాన్ని మెచ్చుకుంటున్నారు.

ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement