Sharwanand Couple in Tirumala: తిరుమలలో శర్వానంద్ దంపతుల సందడి.. శ్రీవారిని దర్శించుకున్న కొత్త జంట.. వీడియో వైరల్

టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ (Sharwanand) ఇటీవల ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. జైపూర్‏లోని (Jaipur) లీలా ప్యాలెస్‏లో జూన్ 3న రక్షిత రెడ్డి (Rakshitha Reddy) మెడలో శర్వానంద్ మూడు ముళ్లు వేశారు.

Sharwanand (Credits: Twitter)

Tirumala, June 16: టాలీవుడ్ (Tollywood) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో శర్వానంద్ (Sharwanand) ఇటీవల ఓ ఇంటివాడయిన సంగతి తెలిసిందే. జైపూర్‏లోని (Jaipur) లీలా ప్యాలెస్‏లో జూన్ 3న రక్షిత రెడ్డి (Rakshitha Reddy) మెడలో శర్వానంద్ మూడు ముళ్లు వేశారు. గ్రాండ్ గా జరిగిన వీరి వివాహనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పాల్గొని.. నూతన వధూవరులను ఆశీర్వాదించారు. ఇక జూన్ 9న హైదరాబాద్ లో శర్వానంద్, రక్షిత రెడ్డి రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా ఈ జంట తిరుమలలో శ్రీవారిని దర్శించి ఆశీస్సులు పొందారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement