TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు..వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనం, వీడియో ఇదిగో
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు(Raghavendra Rao), కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు(Raghavendra Rao), కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రాఘవేంద్రరావుకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ప్రతీ సంవత్సరం దర్శించుకుంటానని చెప్పారు రాఘవేంద్రరావు. వాస్తవానికి శ్రీవారిని దర్శించుకోవడం రాఘవేంద్రరావుకు సెంటిమెంట్. ఆయన దర్శకత్వం వహించిన సినిమా రిలీజ్కు ఉందంటే ఖచ్చితంగా శ్రీవారిని దర్శించుకుంటారు.
తిరుమలలో ఫిబ్రవరి 12న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగనుంది. పురాణాలపరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకరమాసం నందు నిర్వహించడం ఆనవాయితీ.
Director K. Raghavendra Rao Visits Tirumala Srivari Temple