Earthquake in Assam: అస్సాం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం.. తీవ్రత 4.4గా నమోదు

అస్సాం (Assam), అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో (Andaman and Nicobar Islands) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్‌పుర్‌లో (Sonitpur) భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

Newdelhi, May 29: అస్సాం (Assam), అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో (Andaman and Nicobar Islands) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.03 గంటలకు అస్సాంలోని సోనిట్‌పుర్‌లో (Sonitpur) భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. దీనివల్ల ఎలాంటి నష్టమూ జరగలేదని అధికారులు చెప్పారు. ఇక అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఉదయం 7.48 గంటలకు భూమి కంపించిందని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. దీని తీవ్రత 4.8గా నమోదయిందని తెలిపింది. డిగ్లిపూర్‌ (Diglipur)కు 137 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూమి పొరల్లో 70 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని చెప్పింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now