Free Insurance for Sabarimala Pilgrims: శబరిమల అయ్యప్ప భక్తులకు ఉచిత బీమా.. ఈ ఏడాది వరకు మాత్రమే
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. అయ్యప్ప స్వామి భక్తులకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు కేరళ దేవాదాయ శాఖ ప్రకటించింది.
Newdelhi, Nov 3: శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు (Sabarimala Pilgrims) శుభవార్త. అయ్యప్ప స్వామి భక్తులకు ఉచిత బీమా (Free Insurance) సదుపాయం కల్పిస్తున్నట్లు కేరళ దేవాదాయ శాఖ ప్రకటించింది. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే మండలం-మకరవిళక్కు సీజన్ లో శబరిమలను సందర్శించే భక్తులకు రూ.5 లక్షల ఉచిత బీమా సదుపాయం వర్తిస్తుందని వెల్లడించింది. ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు ఈ ఏడాది శబరిమలకు వచ్చే భక్తులందరికీ బీమా కవరేజ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఉచిత బీమా ఈ ఏడాదికే పరిమితం అని వివరించింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు.. ఈ నెల 11 నుంచి సభ ప్రారంభం.. కనీసం పదిరోజుల పాటు సమావేశాలు
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)