Video: వీడియో ఇదిగో, పెన్సన్ కోసం 2 కి.మీ.లు బురదలో పాక్కుంటూ వెళ్లిన బామ్మ, అధికారులపై మండిపడుతున్న నెటిజన్లు

ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ సొంత జిల్లా కియోంఝర్‌లోని రైసాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ పెన్షన్‌ కోసం పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది.

80-year-old woman made to crawl 2km to collect pension in Odisha (Photo-X)

ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ సొంత జిల్లా కియోంఝర్‌లోని రైసాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ పెన్షన్‌ కోసం పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది. పెన్షన్‌ కావాలంటే పంచాయతీ ఆఫీస్‌దాకా వచ్చి నువ్వే తీసుకో అని అధికారులు తెగేసి చెప్పడంతో 80 ఏళ్ల బామ్మ 2 కి.మీ.లు పాక్కుంటూ వెళ్లింది. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్‌ కావడంతో అధికారులపై అందరూ మండిపడుతున్నారు.

తక్కువ కట్నం ఇచ్చినందుకు భార్యను అవమానించడం శిక్షార్హమైన నేరం కాదు, వరకట్నంపై అలహబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బురద ఉన్న ఎర్రమట్టి బాట గుండా పాకుతూ వచ్చి పెన్షన్‌ తీసుకున్నారు. వృద్ధురాలు ఇంత కష్టపడి కార్యాలయానికి వస్తుంటే పట్టించుకోరా? అని బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ గీతా ముర్మును కొందరు నిలదీశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై బామ్మకు ఇంటి వద్దే పెన్షన్‌ ఇస్తామని మాటిచ్చారు. ఆమెకు ఒక చక్రాల కుర్చీని సైతం అందజేశారు. ఇకపై ఇంటి వద్దే రేషన్‌ సైతం అందిస్తామని స్పష్టంచేశారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement