Nitish Kumar Covid: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు కరోనా, ఆయన నివాసంలో 11 మందికి కోవిడ్, ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో బీహార్ ముఖ్యమంత్రి

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా కరోనా బారినపడ్డారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందని, వైద్యుల సలహా మేరకు ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారని సీఎంవో వెల్లడించింది.

Bihar CM Nitish Kumar (photo-ANI)

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా కరోనా బారినపడ్డారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందని, వైద్యుల సలహా మేరకు ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారని సీఎంవో వెల్లడించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని తెలిపింది. కాగా, గతవారం నితీశ్ కుమార్ నివాసంలో 11 మందికి కరోనా సోకింది. వారిలో ఆరుగురు సీఎం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతావారు వంటవాళ్లు. గత మంగళవారం పలువురు మంత్రులు, ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement