Birbhum killings: బీర్‌భూమ్‌ సజీవ దహనాల కేసును స్వీకరించిన సీబీఐ, 8 మంది మరణంపై పలు కేసులు నమోదు

West Bengal బీర్‌భూమ్‌ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. 8 మంది మరణంపై పలు కేసులు నమోదు చేసింది. సీబీఐకి చెందిన సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నిపుణుల బృందం సంఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించింది.

Birbhum killings | Representative Image

West Bengal బీర్‌భూమ్‌ సజీవ దహనాలపై విచారణ బాధ్యతను కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వీకరించింది. 8 మంది మరణంపై పలు కేసులు నమోదు చేసింది. సీబీఐకి చెందిన సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నిపుణుల బృందం సంఘటనా స్థలంలో పలు ఆధారాలు సేకరించింది. అంతకుముందు కలకత్తా హైకోర్టు ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రగతి నివేదికను వచ్చేవారం సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం బీర్‌భూమ్‌ జిల్లాలోని బోగ్తూయి గ్రామంలో 10 ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టడంతో 8 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. సజీవ దహనాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అనారుల్‌ హుస్సేన్‌ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ శుక్రవారం డిమాండ్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

YouTuber Mastan Sai Arrest: హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు, యూట్యూబర్ మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు..

SC on Maha Kumbh 2025 Stampede: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు, దురదృష్టకరమంటూ పిల్‌ను తిరస్కరించిన అత్యున్నత ధర్మాసనం

Dalit Girl Rape-Murder in Ayodhya: మనుషులేనా వీళ్లు.. యువతి ప్రైవేట్ పార్టులో కర్రపెట్టి కామాంధులు దారుణంగా అత్యాచారం, అయోధ్యలో దళిత యువతిపై హత్యాచారం కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు

Share Now