Covid in India: దేశంలో మళ్లీ మెల్లిగా పెరుగుతున్న కేసులు, కొత్తగా 2628 మందికి కరోనా, 15,414 కేసులు యాక్టివ్‌

దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 2124 కేసులు నమోదవగా, కొత్తగా మరో 2628 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇది నిన్నటికంటే 24 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,44,820కు చేరాయి. ఇందులో 4,26,04,881 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో 5,24,525 మంది మరణించగా, 15,414 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 2124 కేసులు నమోదవగా, కొత్తగా మరో 2628 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇది నిన్నటికంటే 24 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,44,820కు చేరాయి. ఇందులో 4,26,04,881 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో 5,24,525 మంది మరణించగా, 15,414 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 18 మంది మృతిచెందగా, 2167 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.03 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.75, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 1,92,82,03,555 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, ఇందులో బుధవారం ఒకేరోజు 13,13,687 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని పేర్కొన్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement